అయోధ్య కేసులో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య కేసుకు సంబంధించి దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా(బాల రాముడు)కే చెందుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), నిర్మోహీ అఖారాతో పాటు దాదాపు 40 వరకు ప్రజాసంఘాలు ఈ పిటిషన్లు వేశాయి.
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల తుది తీర్పు వెలువరించింది.
ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది.
అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అనేక సంస్థలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ స్పందన ఏమిటి?
- అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన వారికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








