కేదార్నాథ్ గుహలో మోదీ ధ్యానం: కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసిన మొదటి ప్రధాని అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు

ఫొటో సోర్స్, @BJP4India/Twitter
ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడున్న గుహలో ధ్యానానికి కూర్చున్నారు.
సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ ఫొటోలపై మోదీ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే, వ్యతిరేకులు మాత్రం కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసే మొదటి ప్రధాని మోదీయే అంటూ ఛలోక్తులు విసిరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్లోని ఓ గుహకు చేరుకున్నారు. వెంట వెళ్లిన మీడియా విజ్ఞప్తి మేరకు గుహలో ధ్యానం చేసుకుంటున్న ఫొటోలను తీసుకోవడానికి ఆయన అనుమతించారు. ఈ ధ్యానం రేపు ఉదయం వరకూ కొనసాగుతుంది. ఆ గుహ సమీపంలోకి మీడియా గానీ, ఇతర వ్యక్తులను గానీ అనుమతించరు అని తెలిసింది" అని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
అయితే ప్రధాని ఫొటోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. విమర్శలు, ప్రతి విమర్శల ట్వీట్లతో హోరెత్తిపోయింది.

ఫొటో సోర్స్, Twitter
"మీడియా కోరినవన్నీ చేస్తున్నారు ప్రధాని, బాగుంది" అని సీనియర్ జర్నలిస్టు సుహాసినీ హైదర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
"మోదీ జీ, శివుడికి ఎలాంటి సూట్లూ లేవు. మీలాగా ఆయన ధనవంతుడు కాదు. ఆయన రాజకీయాలు కూడా చేయడు. మీ సూట్లలో ఒకటి ఆయనకు ఇవ్వండి. మీకు 10 లక్షల విలువైన సూట్లు చాలా ఉన్నాయి కదా" అని సంఘమిత్ర పేరుతో ఉన్న ఓ ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Twitter
ఆయన ఆధునిక దుస్తులు ధరించిన ఓ రుషి అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసే మొదటి ప్రధాని మోదీ అని మొహమ్మద్ అనాస్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Twitter
నిన్న జరిగిన మీడియా సమావేశంలో మీడియా విజ్ఞప్తి చేసినా ఎందుకు తిరస్కరించారు, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అని మమతా జగ్గి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
మీడియా విజ్ఞప్తి చేస్తున్న రఫేల్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడు మాట్లాడతారు మరి అని డాక్టర్ వత్స అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
"ఈ ఫొటోలన్నీ అసలైన నాటకానికి రిహార్సల్స్ అనుకోవాలా.. బాగా చేశారు, చట్టాలను, నిబంధనలను ఎవరికీ దొరక్కుండా ఎలా అతిక్రమించాలనే దానిపై నరేంద్ర మోదీ ఓ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించాలి. ఇది కూడా వారి ప్రచారంలో భాగమే" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
- BBC Reality Check: భారత దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- భారత ఎన్నికలపై బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు?
- ఎల్టీటీఈ ప్రభాకరన్: స్వాతంత్ర్య యోధుడా.. ఉన్మాద నాయకుడా
- ఈ దేశంలో... జననాల కన్నా అబార్షన్లు ఎక్కువ
- బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
- పసిబిడ్డను సజీవ సమాధి చేసిన తల్లి.. మట్టిని తవ్వి బిడ్డను కాపాడిన శునకం
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








