మండుటెండల్లో ఉడుకుతున్న దిల్లీ, రాజస్థాన్.. ఫలోదీలో 50 డిగ్రీలు

దిల్లీలో ఎండలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ఎండ వేడికి ముఖాన్ని నీటితో తడుపుతున్న యువతి

దేశంలోని ఉత్తరాధి రాష్ట్రాల్లో వడగాలులు, తీవ్రమైన ఎండలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

పలు రాష్ట్రాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. శనివారం రాజస్థాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆదివారం బర్మర్ సిటీలో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఎండ వేడి

ఫొటో సోర్స్, Getty Images

రాబోయే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షం పడే సూచనల్లేవని ఆయన చెప్పారు.

బుధవారం వరకు ఈ హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది.

ఎండల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పలు ప్రాంతాలు నీటి కొరత, విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఎండ వేడి

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి వాటిపై ఆధారపడుతున్నారు
దిల్లీలో చెట్టు నీడన సేద తీరుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో చెట్టు నీడన సేద తీరుతున్న ప్రజలు

బుధవారం రోజున దిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,000మెగావాట్లకు చేరింది. దిల్లీ చరిత్రలోనే ఇది అత్యధికం.

దిల్లీలో భయంకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారం అంతా ఎండల తీవ్రత 45-46 డిగ్రీలుగా నమోదైంది.

అధిక స్థాయిలోని తేమ కారణంగా హీట్ ఇండెక్స్ 50 డిగ్రీలను దాటిపోయిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

వడదెబ్బ సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రిలో చేరిన రోగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ తరహా రోగుల సంఖ్య పెరుగుతోంది.

ఎండ వేడి

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ఎండ భయంకరంగా ఉంది
ఎండలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోజూవారీ పనుల కోసం బయటకు వెళ్లేవారికి ఎక్కువగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది

దిల్లీలో భరించలేని స్థాయిలో వేడి ఉందని రోహిత్ నాయర్ అన్నారు. ఆయన దిల్లీలోని ఓ అడ్వర్టయిజింగ్‌ కంపెనీలో పని చేస్తున్నారు.

‘‘దిల్లీ ఎండతో కుతకుతలాడుతోంది. ఎండలతో తీవ్రంగా అలసిపోతున్నాం. మధ్యాహ్నం వేళల్లో అడగు బయటపెట్టట్లేదు. ఇంట్లో కూడా వేడి కారణంగా ఉండలేకపోతున్నాం. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం’’ అని నాయర్ అన్నారు. ..

ఎండలో పనిచేస్తున్న కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గంటల తరబడి ఎండలో ఆరుబయట పనిచేసే కార్మికులు ఈ వేసవిలో చాలా ఇబ్బంది పడుతున్నారు
ఎండ వేడి

ఫొటో సోర్స్, Getty Images

ఏసీలు కూడా పనిచేయట్లేదు

ఎండ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నామని ఏఎన్‌ఐతో మరో దిల్లీ నివాసి చెప్పారు.

వేడి కారణంగా కార్లలో ఏసీలు కూడా పనిచేయట్లేదని వెల్లడించారు.

మునుపటి కంటే ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)