తమిళనాడు వరదలు: ఊరేదో, చెరువేదో తెలియట్లేదు!
తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది.
భారీ వర్షాలతో పలు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊరేదో, చెరువేదో అర్థం కానంతగా వరద నీరు ఊళ్లను ముంచెత్తింది.
తమిళనాడులోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

టుటికోరిన్, తిరునెల్వేలి జిల్లాల్లో 352 మిల్లీమీటర్లు, కన్యాకుమారిలో 118 మిల్లీమీటర్లు, తెంకాసిలో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.
పలు డ్యామ్లు నిండు కుండల్లా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. పలు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
వరద ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐవీఎఫ్కు వయో పరిమితి ఉందా? 50 ఏళ్లు దాటాక ఈ విధానంలో పిల్లలను కంటే ఏమవుతుంది?
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









