తమిళనాడు: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట దృశ్యాలు.. 9 ఫోటోలలో

ఫొటో సోర్స్, Getty Images
తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మృతి చెందారని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

శనివారం(సెప్టెంబర్ 27) కరూర్లోని వేలుచామిపురంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో టీవీకే నేత విజయ్ పాల్గొన్నారు. జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశంలో వందల సంఖ్యలో చెప్పులు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.


ఆస్పత్రుల వద్ద బాధితుల బంధువులు రోదిస్తున్నారు. కరూర్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 61 మంది చికిత్స పొందుతున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తమిళనాడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.

ఫొటో సోర్స్, CMO Tamilnadu


ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










