ఇండోనేసియాలో భూకంపం... కూలిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు

ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 34మంది చనిపోయుంటారని అంచనా.
పాక్షికంగా కూలిపోయిన సులవేసి ఆసుపత్రి శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారికోసం రక్షక బృందాలు గాలిస్తున్నాయి.
శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. వేలమంది నిరాశ్రయులయ్యారు.
ఇండోనేసియాలో ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. 2018లో సులవేసిలో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
మముజు పట్టణంలో మిత్ర మనకర్ర ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోవడంతో ఆరుగురు రోగులు, వారి కుటుంబ సభ్యులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారని స్థానిక మీడియా తెలిపింది.
చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మముజు రక్షక బృందానికి చెందిన అరియంటో ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు.
నగరంలో కనీసం 26మంది చనిపోయుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, కూలిన భవనాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని రక్షక బృందం తెలిపింది.
మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మజేన్ నగరంలో ఎనిమిది మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని మొదట వచ్చిన రిపోర్ట్స్ తెలిపాయి.

శుక్రవారం తెల్లవారు జామున స్థానిక సమయం 1.00కు దాదాపు ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి.
అక్కడి ప్రభుత్వం సునామి హెచ్చరికలేమీ జారీ చేయలేదు. కానీ, అనేకమంది భయంతో తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని సమాచారం.
తీవ్రంగా దెబ్బ తిన్న వాటిల్లో కొన్ని ఇళ్లు, హోటళ్లు, గవర్నర్ ఆఫీస్, ఒక మాల్ ఉన్నాయని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే, తీవ్ర భూకంపానంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని, ఫలితంగా సునామీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని అధికారులు హెచ్చరించారు.
ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఎందుకంటే ఆ దేశం భౌగోళికంగా 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే గీత మీద ఉంది. ఈ గీత మీద తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తుంటాయి.
2004లో సుమత్రా దీవుల్లో భూకంప సంభవించి, సునామీకి కారణమైంది. హిందూ మహా సముద్రం తీర ప్రాంతంలో 2,26,000మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,20,000 కన్నా ఎక్కువమంది మరణించారు.

ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- జో బైడెన్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన కాబోయే ప్రెసిడెంట్
- ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?
- సిరాజ్పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








