థియేటర్లలో విడుదలతో పాటే సినిమాల స్ట్రీమింగ్... వార్నర్ బ్రదర్స్ నిర్ణయంతో హాలీవుడ్లో చిచ్చు

ఫొటో సోర్స్, WARNER BROS
ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం థియేటర్లలోనే కాకుండా స్ట్రీమింగ్ లోనూ సినిమాలు విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ తీసుకున్న నిర్ణయం హాలీవుడ్ స్టూడియోలు, సినిమా థియేటర్ యాజమాన్యాల మధ్య చిచ్చుపెట్టింది.
త్వరలో విడుదల కాబోయే సైంటిఫిక్ మూవీ ‘డ్యూనే’, ‘ది మ్యాట్రిక్స్’ సీక్వెల్ సినిమాలను థియేటర్లతోపాటు హెచ్బీఓ మ్యాక్స్లో కూడా విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించింది.
అమెరికాలో కొత్త సినిమాలు సర్వసాధారణంగా థియేటర్లలో విడుదలవుతాయి. కానీ కరోనా కారణంగా చాలా సినిమా థియేటర్లు మూతపడటంతో విడుదల ఆగి హాలీవుడ్ స్టూడియోలకు ఖర్చులు పెరిగాయి.
అందుకే 2021లో విడుదలయ్యే తన అన్ని సినిమాలను హెచ్బీఓ మ్యాక్స్లో విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించింది. హెచ్బీఓ మ్యాక్స్ వార్నర్ బ్రదర్స్ మాతృ సంస్థ ఏటీ అండ్ టీకి చెందిన స్ట్రీమింగ్ కంపెనీ.
అమెరికాలో థియేటర్లలో విడుదలైన వెంటనే ఇవి హెచ్బీఓ మ్యాక్స్లో కూడా విడుదలవుతాయి. అయితే బ్రిటన్లో మాత్రం అవి నెల రోజుల తర్వాత అందుబాటులోకి వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెడీ టు రిలీజ్
‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, ‘మోర్టల్ కంబాట్’, ‘ది సూసైడ్ స్క్వాడ్’ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ‘వండర్ ఉమన్ 1984’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లతోపాటు హెచ్బీఓ మ్యాక్స్లో కూడా విడుదలవుతాయని వార్నర్ బ్రదర్స్ ఇంతకు ముందే ప్రకటించింది.
‘‘కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది’’ అని వార్నర్ మీడియా స్టూడియోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నా సర్నాఫ్ అన్నారు.
‘‘కొత్త సినిమాల విడుదల అనేది అమెరికాలో సినిమా థియేటర్లకు శ్వాసలాంటిదన్న విషయం మాకు తెలుసు. కానీ ప్రస్తుతం సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి. వచ్చే సంవత్సరం ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గించాల్సి ఉంది. ఈ పరిస్థిత్లుల్లో ఇలాంటివి తప్పదు’’ అని సర్నాఫ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంతకు ముందే వివాదం
థియేటర్లతోపాటు స్ట్రీమింగ్ లో కూడా ఒకేసారి సినిమాలు విడుదల చేయాలన్న యూనివర్సల్ ఫిల్మ్స్ నిర్ణయంపై అమెరికాలో అతిపెద్ది సినిమా థియేటర్ల సంస్థ ఏఎంసీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఆ సంస్థ సినిమాలను తీసుకోబోమంటూ నిషేధం ప్రకటించింది.
ఆ తర్వాత ఆ రెండు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చి థియేటర్లలో విడుదలైన 17రోజుల తర్వాత డిజిటల్ లో రిలీజ్ పై ఒప్పందానికి వచ్చాయి.
‘‘ ఇది సినిమా థియేటర్లకు వెళ్లలేని వారి కోసం మేం వేసిన ఏడాది ప్రణాళిక మాత్రమే’’ అన్నారు సర్నాఫ్.
2021లో మంచి మంచి సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ప్రేక్షకులకు దూరం చేయడం తమకు ఇష్టం లేదని సర్నాఫ్ వ్యాఖ్యానించారు. ‘‘మా ప్రణాళిక అందరికీ ప్రయోజనం కలిగించేది’’ అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
- పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









