మెక్సికో: సమాధుల మధ్య 59 మంది టీనేజర్ల మృతదేహాలు.. పదికి పైగా అమ్మాయిల శవాలే.. వారంతా ఎవరు

ఫొటో సోర్స్, EPA
మెక్సికోలోని గువానజువాటో రాష్ట్రంలో 59 మృతదేహాలు ఒకే చోట గుర్తించారు. వీటిలో చాలా మృతదేహాలు యుక్త వయసులో ఉన్నవారివే.
మృతదేహాలు లభించిన సాల్వటియెర్ర మున్సిపాలిటీ ప్రాంతాన్ని మెక్సికోలో అత్యంత హింసాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
ఇక్కడ ఉండే మాదకద్రవ్యాల వ్యాపారులు డ్రగ్స్ అక్రమ రవాణా రూట్ల కోసం వివాదాలలోకి దిగుతూ ఉంటారు.
ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో 2,200 హత్యలు నమోదయ్యాయి.
తప్పిపోయిన కొందరు వ్యక్తుల గురించి వారి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో గాలించగా ఇలా ఒకే చోట 59 మృతదేహాలు కనిపించాయని మెక్సికో నేషనల్ సెర్చ్ కమీషన్ అధికారి కార్ల కింటానా చెప్పారు.
మృతుల్లో 10 మందికి పైగా అమ్మాయిలు కూడా ఉన్నారు.
వీటిని కనిపెట్టడానికి కనీసం 80 మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే, అక్కడ మృత దేహాలు ఉండి ఉండవచ్చనే సమాచారాన్ని ఎవరు అందించారనే విషయాన్ని అధికారులు చెప్పలేదు.
వీటిని గుర్తించడానికి ముందు కనీసం 52 చోట్ల తవ్వకాలు జరిపినట్లు సెర్చ్ కమిషనర్ హెక్టర్ డియాజ్ చెప్పారు.
గువానజువాటోను నేరస్థులకు అడ్డాగా చెబుతారు.
జులైలో ఇరపువాటోలో ఉండే ఒక మాదకద్రవ్యాల రీహాబిలిటేషన్ కేంద్రంలోకి ఆయుధాలు ధరించిన వ్యక్తులు చొరబడి 24 మందిని హతమర్చిన ఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో అంతకు ఒక నెల క్రితం కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
2018లో మెక్సికో అధ్యక్షునిగా అధికారంలోకి వచ్చిన మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ ఈ గ్యాంగు హింసను నిర్మూలిస్తానని ప్రమాణం చేశారు. కానీ, దేశంలోనే అత్యధిక స్థాయిలో హత్యలు 2019లో నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








