కరోనావైరస్: మృతుల సంఖ్యలు చైనాను దాటేసిన భారత్.. దక్షిణ కొరియాలో మళ్లీ పాఠశాలల మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ కేసులు హఠాత్తుగా పెరగడంతో దక్షిణకొరియాలో కొన్నిరోజుల క్రితం తెరిచిన 200 స్కూళ్లు మూతపడ్డాయి.
గత 24 గంటల్లో దక్షిణకొరియాలో 56 వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలల క్రితం నమోదైన 79 కేసుల కంటే ఇది తక్కువే. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి బయటపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కొత్తగా నమోదైన వాటిలో ఎక్కువ కేసులు సియోల్కు దగ్గరగా ఉన్న బుచాన్లోని ఒక పంపిణీ కేంద్రంలోనే బయటపడ్డాయి.
ఈ గిడ్డంగిని దేశంలోని అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ కుపాంగ్ నడుపుతోంది. ఈ గోడౌన్లో వైరస్ను అదుపు చేసేందుకు కఠిన జాగ్రత్తలను పాటించడం లేదని అధికారులు చెప్పారు.
అందులో పనిచేస్తున్న కార్మికుల బూట్లు, బట్టలపైన కూడా కోవిడ్-19 వైరస్ జాడలు గుర్తించినట్లు వైద్య శాఖ అధికారులు చెప్పారు. ఆ కేంద్రంలో పనిచేస్తున్న వేలాది కార్మికులను ట్రాక్ చేసి గుర్తించిన వైద్య సిబ్బంది, వారికి పరీక్షలు చేయగలిగారు. మరో రెండు వారాలపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పంపిణీ కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేయనున్నారు.
కరోనావైరస్ వ్యాపించవచ్చనే భయంతో బుచాన్లో ఇటీవలే తెరిచిన 251 స్కూళ్లను మూసివేశారు. కరోనాకు భయపడి ఇక్కడ కొన్ని వందల స్కూళ్లను ఎప్పటినుంచో మూసివేసే ఉన్నారు.

సియోల్లో ఒక విద్యార్థిని కరోనా పాజిటివ్గా గుర్తించారు. అతడి తల్లి కూపాంగ్ గిడ్డంగిలోనే పనిచేస్తున్నారు. కొత్తగా కరోనా కేసులు బయటపడడంతో వైద్య శాఖ అధికారులు మళ్లీ కొన్ని ఆంక్షలు విధించారు. మరో రెండు వారాలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.
సియోల్, చుట్టుపక్కల నగరాల్లో పబ్లిక్ పార్కులు, మ్యూజియంలు మూసివేశారు. వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడవద్దని మరోసారి ప్రజలను కోరారు.
దక్షిణకొరియాలో కరోనావైరస్ కోసం ఇప్పటివరకూ లాక్డౌన్ విధించలేదు. దాని బదులు దేశంలో విస్తృత ట్రాకింగ్ టెస్టింగ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ సామాజిక దూరం నిబంధనలను చాలావరకూ స్వచ్ఛందంగానే పాటిస్తారు. ఇప్పుడు మరోసారి దీనిని పాటించాలని ప్రజలకు ఎమోషనల్గా కోరారు.
అధికారులు తమ సందేశంలో “ఈ జాగ్రత్తలు మన పిల్లలు మళ్లీ బడికి వెళ్లేలా చేస్తాయి. వారి చదువుకు ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాయి. వీటికి కట్టుబడి ఉందాం” అన్నారు. గతంలో ఫలితం ఇచ్చిన ఈ చర్యలు మళ్లీ పనిచేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA/HARISH TYAGI
భారత్లో 4,706 కోవిడ్ మరణాలు
కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు భారత్లో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం భారత్లో మరణాల సంఖ్య చైనాను దాటేసింది.
గత 24 గంటల్లో దేశంలో 7,466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు నమోదైన కేసుల్లో ఈ సంఖ్య అత్యధికం అని ఆరోగ్య శాఖ చెప్పింది. భారత్లో కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 4,706కు పెరిగింది.తాజా గణాంకాల ప్రకారం భారత్ ఈ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య చైనాను దాటింది. చైనాలో అధికారిక గణాంకాల ప్రకారం కోవిడ్-19 వల్ల 4,638 మంది చనిపోయారు.భారత్లో ఇప్పటివరకూ 1,65,799 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో భారత్ చైనాను గత వారమే దాటేసింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత్లో ఇప్పుడు 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 71,105 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ మొత్తం 59,546 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఈ మహమ్మారి వల్ల 1982 మంది చనిపోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడు(19,372), దిల్లీ(16,281), గుజరాత్(15,562), రాజస్థాన్(8067)లో నమోదయ్యాయి. కొన్నిరోజుల క్రితం గుజరాత్ మూడోస్థానంలో ఉండగా, ఈ వారం అత్యధిక కేసులు నమోదవడంతో దిల్లీ ఆ స్థానంలోకి చేరుకుంది. రాజధాని పరిధిలో ఒకే రోజు 1024 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ ఇదే అత్యధికం అని దిల్లీ ఆరోగ్య శాఖ గురువారం చెప్పింది.దిల్లీలో కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ 316 మంది చనిపోయారు. ఇక్కడ 8470 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, getty images
సింగపూర్ ట్రావెల్ బబుల్స్
ఇటు సింగపూర్ అధికారులు కోవిడ్19 అదుపులో ఉన్న దేశాలతో కలిసి ‘ట్రావెల్ బబుల్స్’ లేదా ‘గ్రీన్ లేన్స్’ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
“చాలా దేశాలతో దీనిపై చర్చిస్తున్నాం. కొన్ని చాలా అడ్వాన్స్ దశలో ఉంటే మా లాంటి కొన్ని దేశాలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి” అని సింగపూర్ జాతీయాభివృద్ధి మంత్రి లారెన్స్ వాంగ్ చెప్పారు.
ఇందులో భాగంగా ప్రయాణించే ముందు ప్రయాణికులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్పష్టమైన ప్రొటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం ఒక దేశం నుంచి సింగపూర్ వచ్చే లేదా ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లే ఏ ప్రయాణికుడికి అయినా పరీక్షలు చేయడం జరుగుతుంది.. వారు కరోనా నుంచి విముక్తి పొందారు అని తెలిసిన తర్వాతే, అతడి ‘అవసరమైన ప్రయాణం’ తిరిగి ప్రారంభమవుతుంది” అన్నారు.
వారు వీటిని ‘ప్రయాణాలు’, ‘పర్యటకం’ అనడానికి బదులు ‘అవసరమైన ప్రయాణం’ అనే పదం ఉపయోగించారు.
ఒక్క సింగపూర్కు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ప్రజలు మళ్లీ మామూలుగా ప్రయాణించడం కొనసాగాలంటే చాలాకాలం పడుతుంది అని వాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జపాన్లో కొత్త కేసులు నమోదు
జపాన్లో అత్యవసర స్థితిని ఎత్తివేసిన తర్వాత దేశంలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఫుకువోకాలోని కిటాక్యూషూ నగరంలో వారాంతం నుంచి 22 కొత్త కేసులు నమోదయ్యాయి. అవి మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రెస్పాన్స్ టీంను అక్కడకు పంపింది.
దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర స్థితిని ప్రధాని షింజో అబే ఎత్తివేశారు. దీంతో గవర్నర్లు సోమవారం తమ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేయాల్సి వచ్చింది. కానీ, ఫుకువోకా ప్రాంతీయ అధికారులు మాత్రం మే 14న అక్కడి అత్యవస స్థితిని ఎత్తివేశారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- ‘వీడియో కాల్లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








