ఇండోనేసియా సునామీ: 1200 దాటిన మృతుల సంఖ్య

ఇండోనేసియా భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఇండోనేసియాను శుక్రవారం నాడు కుదిపేసిన భూకంపం, ఆ తరువాత విరుచుకుపడిన సునామీ సృష్టించిన విధ్వంంసలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వలయంలో చనిపోయిన వారి సంఖ్య 1200 దాటిందని అధికారులు ప్రకటించారు.

మంగళవారం నాడు 844 మంది చనిపోయినట్లు ప్రకటించారు. కానీ, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ ప్రజలు భారీ సంఖ్యలో చనిపోయిన వాస్తవం వెలుగులోకి వస్తోంది.

సులవేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పాలూ తీర ప్రాంతాన్ని సునామీ ముంచెత్తింది. బాధితులు తాగునీరు, ఆహారం, ఇంధనం కోసం అలమటిస్తున్నారు.

ఇండోనేసియా భూకంపం

ఫొటో సోర్స్, AFP

చాలా మంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.

కొండ చరియ విరిగి పడడంతో బురదనీరు చర్చిలోకి కొట్టుకువచ్చిన బురదలో 34 మంది విద్యార్థులు సజీవ సమాధి అయ్యారని ఇండోనేసియా రెడ్ క్రాస్ అధికారులు బీబీసీతో చెప్పారు.

జోనూగె చర్చి బైబిల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 86 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. వారిలో 34 మంది మృత దేహాలు లభ్యమయ్యాయి. కానీ, మిగతా 52 మంది విద్యార్థులు ఏమయ్యారో తెలియలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)