ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ వాహనం పేల్చివేత.. 9 మంది జవాన్లు మృతి

ఫొటో సోర్స్, Alok Putul/BBC
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఒక మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చివేయడంతో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.
చత్తీశ్గఢ్ స్పెషల్ డీజీ (నక్సల్ ఆపరేషన్స్) డీఎం అవస్థి కథనం ప్రకారం.. జిల్లాలోని కిష్టారం-పలోడి రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. 212వ బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒక ఆపరేషన్ నిమిత్తం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది.
ఈ మైన్ ప్రూఫ్ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ పేల్చివేతలో మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే వాయుమార్గం ద్వారా రాయ్పూర్కు తరలించారు.
ఈ సంఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Alok Putul/BBC
ఈ ఘటన జరిగిన వెంటనే రాయ్పూర్ నుంచి భారీ ఎత్తున భద్రతా బలగాలను సుక్మా జిల్లాకు తరలించారు.
గత ఏడాది మార్చి 11న జిల్లాలోని భేజి ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో 12 మంది జవాన్లు మరణించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఏప్రిల్ 24న మావోయిస్టులు ఇదే తరహాలో చేసిన దాడిలో 25 మంది పారామిలటరీ సిబ్బంది మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








