‘‘ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చాక, చివరి నిమిషంలో చేరలేనని చెప్పడం న్యాయమా’’- ఈ అంశంపై ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, EASEMYTRIP WEBSITE
భారత్కు చెందిన ఒక స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు చేసిన ఒక ట్వీట్, సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఆయన చేసిన ఈ ట్వీట్ కారణంగా ఉద్యోగులు, యజమానులు ఒకరిపట్ల ఒకరు ఎలాంటి గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తున్నారు.
ఆన్లైన్ ట్రావెల్ సంస్థ 'ఈజ్ మై ట్రిప్' సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్తో ఈ చర్చ మొదలైంది.
ప్రశాంత్ పిట్టి, తనకు ఒక ఉద్యోగార్ధి పంపిన మెసేజ్ స్క్రీన్షాట్ను ట్విటర్లో షేర్ చేశారు.
'నాకు మరో జాబ్ ఆఫర్ రావడం వల్ల మీ సంస్థలో చేరకూడదని నిర్ణయించుకున్నా' అని పేర్కొంటూ సదరు అభ్యర్థి ప్రశాంత్ పిట్టికి మెసేజ్ పంపారు. ఈజ్ మై ట్రిప్ కంపెనీలో జాయిన్ కావాల్సిన రోజునే ఆ వ్యక్తి, తాను చేరలేనంటూ సందేశాన్ని పంపించారు.
ఆ స్క్రీన్ షాట్ను ట్విటర్లో పంచుకుంటూ... ''తీరా సమయానికి ఇలా చెప్పడం వ్యవస్థలో ప్రబలిపోయింది. ఇదో పెద్ద సమస్య'' అంటూ ప్రశాంత్ పిట్టి వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వర్క్ కల్చర్ గురించి సోషల్ మీడియాలో చర్చలు భారత్లో సాధారణం అయ్యాయి.
ఇటీవలే బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో చేసిన ఒక సూచన ఆయనపై విమర్శలకు దారి తీసింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు రోజుకు 18 గంటలు పనిచేయాలని ఆయన సూచించారు.
అభ్యర్థులు చివరి నిమిషంలో ఇలా నిర్ణయాలు మార్చుకుంటే కంపెనీలకు సమయంతో పాటు వనరులు వృథా అవుతాయని ప్రశాంత్ అన్నారు.
అయితే, ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
కొందరు ఆయనకు మద్దతుగా స్పందిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగులను తొలగించడాన్ని, జాబ్ ఆఫర్లను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ కొందరు ట్విటర్ యూజర్లు సదరు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఉద్యోగులను తొలిగించడాన్ని కంపెనీలు సమర్థించుకుంటే, దీన్ని కూడా అంగీకరించాల్సిందే అని అంటున్నారు.
''ఉద్యోగుల్ని తొలిగించడం 'తప్పు' అవుతుంది. ఒకవేళ ఆఫర్ లెటర్ పంపిన తర్వాత చివరి క్షణంలో అభ్యర్థుల్ని కంపెనీలు తిరస్కరిస్తే అది సరైనదేనా, ఇది ఆమోదయోగ్యమేనా, కాదు కదా?'' అని ప్రశాంత్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి ? అనే అంశంపై కూడా చర్చలు జరిగాయి.
అధిక జీతాలు ఇవ్వడం లేదా ఆఫర్ లెటర్పై సంతకం చేసిన రెండు వారాల్లో అభ్యర్థులు, కంపెనీలో చేరేలా చేయాలంటూ కొంతమంది సూచించారు.
ప్రశాంత్ పిట్టికి, వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ మద్దతు పలికారు.
ఇవి కూడా చదవండి:
- గత రెండేళ్లలో మనిషి సరాసరి ఆయుర్దాయం తగ్గింది, రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?
- ఆంధ్రప్రదేశ్: కొత్త పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏమిటీ ఓపీఎస్, జీపీఎస్?
- బ్రహ్మాస్త్ర: ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకోలేకపోయిన రణబీర్ కపూర్, ఆలియా భట్... ఏమిటీ వివాదం?
- ఐఫోన్-14, వాచ్ అల్ట్రా వచ్చేశాయి... వీటిలోని కొత్త ఫీచర్లు ఏంటంటే
- కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్కౌంటర్లకు వాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













