ముంబయి: డోంబివలిలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, 23 మంది అరెస్ట్-Newsreel

రేప్, అత్యాచారం 15 ఏళ్ల బాలికపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ముంబయికి సమీపంలోని డోంబివలీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలతో 29 మందిపై కేసు నమోదైంది. డోంబివలీ ముంబయికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మొత్తం 29 మంది నిందితుల్లో 23 మందిని అరెస్ట్ చేశారు. మిగతా ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిపై ఐపీసీ 376 కింద కేసు కేసు నమోదు చేశారు.

డోంబివలీలో ఏం జరిగింది?

బాలికపై జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గత 8 నెలల పాటు అత్యాచారం జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

"అత్యాచారం చేసినవారు తెలిసివారు, స్నేహితులేనని బాధితురాలు చెప్పింది. డోంబివలీ, బదలాపూర్, రబాలే, మురబాడ్ లాంటి ప్రాంతాల్లో నాలుగైదుసార్లు తనపై అత్యాచారం జరిగిందని బాలిక ఫిర్యాదులో పేర్కొంది" అని ఠాణె అదనపు పోలీస్ కమిషనర్ దత్తాత్రేయ కరాలే బీబీసీకి చెప్పారు.

మొత్తం 29 మంది అబ్బాయిలపై అమ్మాయి రేప్ కేసు పెట్టిందని అధికారులు చెప్పారు.

రేప్, అత్యాచారం ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వీడియో క్లిప్‌‌తో బ్లాక్ మెయిల్

గత జనవరిలో తన బాయ్‌ఫ్రెండ్ తనపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీశాడని, ఆ వీడియోతో అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

"బాలిక ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాం. ఆమె చెప్పినవి ధ్రువీకరించే పనిలో ఉన్నాం" అని కమిషనర్ దత్తాత్రేయ కరాలే చెప్పారు.

పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తును ఒక మహిళా అధికారి చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)