దిశా రవి: గ్రెటా థన్బర్గ్ 'టూల్కిట్' కేసులో ఈ పర్యావరణ కార్యకర్తను కస్టడీలోకి తీసుకోవడంపై వినిపిస్తున్న ప్రశ్నలు...

ఫొటో సోర్స్, DISHA RAVI / FACEBOOK
దిల్లీలోని ఒక కోర్టు 22 ఏళ్ల పర్యావరణ కార్యకర్త దిశా రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
బెంగళూరులోని సీనియర్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ వివరాల ప్రకారం శనివారం సాయంత్రం దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ టూల్కిట్ కేసులో బెంగళూరులో దిశను అరెస్ట్ చేసింది.
భారతదేశంలో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్కిట్’ మీద నమోదైన కేసుకు సంబంధించి.. బెంగళూరుకు చెందిన విద్యార్థి, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దిశా రవి వయసు 21 సంవత్సరాలు. ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేటు కాలేజీలో బీబీఏ డిగ్రీ చేస్తున్నారు.
"టూల్కిట్ కేసులో విచారించడానికి దిశను అదుపులోకి తీసుకున్నారు" అని బెంగళూరులోని ఒక పోలీసు అధికారి పేరు వెల్లడించకూడదనే షరతుపై బీబీసీకి చెప్పారు.
"టూల్కిట్ ఎడిట్ చేస్తున్న వారిలో దిశ కూడా ఉన్నారు" అని ఆదివారం దిల్లీ పోలీస్ ఏపీఆర్ఓ అనిల్ మిత్తల్ ఒక ప్రకటనలో చెప్పారు.
కస్టడీకి పంపించడంపై ప్రశ్నలు
దిశను ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నామని దిల్లీ పోలీసులు చెప్పారు. ఆ సమయంలో ఆమెను విచారించనున్నారు. దర్యాప్తు కోసం పోలీసులు ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ కూడా సీజ్ చేశారు.
లైవ్ లా వెబ్సైట్ వివరాల ప్రకారం దిశను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపించాలనే నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ఆమె తరఫు లాయర్ కోర్టులో లేకపోవడంపై చట్ట నిపుణులు నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ లాయర్ లేని సమయంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, REBECCA JOHN/ FACEBOOK
సుప్రీంకోర్టు లాయర్ రెబెకా జాన్ ఈ అంశంపై ఫేస్బుక్లో "ఈరోజు పటియాలా కోర్టు డ్యూటీ మేజిస్ట్రేట్ ప్రవర్తన నన్ను నిరాశకు గురిచేసింది. ఆయన మహిళకు ప్రాతినిధ్యం వహించే లాయర్ కోర్టులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోకుండానే ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపించాలని ఆదేశించారు" అని రాశారు.
"జడ్జిలు తమ కర్తవ్యాన్ని సీరియస్గా నిర్వర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22ను పూర్తిగా అనుసరించేలా చూడాలి. విచారణ సమయంలో మహిళ తరఫు వాదించడానికి లాయర్ ఎవరూ లేకపోతే ఆమె లాయర్ వచ్చేవరకూ మేజిస్ట్రేట్ వేచిచూడాలి. లేదంటే, ఆమెకు న్యాయ సహాయం అందించాలి. కేస్ డైరీ, అరెస్ట్ మెమోను చూశారా" అన్నారు.
బెంగళూరు కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ లేకుండానే మహిళను దిల్లీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారని మేజిస్ట్రేట్ దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ను అడిగారా అని కూడా ఆమె ప్రశ్నించారు.
రెబెకా జాన్ ఈ పోస్టును ట్విటర్లో చాలామంది చట్ట నిపుణులు షేర్ చేస్తున్నారు. ఈ అంశం గురించి ప్రశ్నిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"జడ్జి ఆమెను కస్టడీకి పంపించాల్సిన అవసరం లేదని, దర్యాప్తుకు ఆమె సహకరిస్తుందని, దిల్లీ వదిలి బయటకు వెళ్లదని జడ్జి చెప్పవచ్చు" అని సుప్రీంకోర్ట్ లాయర్ దుష్యంత్ ఆరోరా రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"దిశా రవి అరెస్ట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి సీనియర్ లాయర్ రెబెకా జాన్ రాశారు" అని దానిని షేర్ చేసిన లాయర్ వినయ్ శ్రీనివాస్ అన్నారు.
చిన్న వాటికే జనాలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని సీనియర్ లాయర్ సౌరభ్ కృపాల్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఆమె దోషి అయితే, విచారణ జరిపి శిక్షించండి. శిక్షకు ప్రత్యామ్నాయంగా ప్రీ-ట్రయల్ అరెస్ట్ అనేది పోలీసులు తమ బాధ్యతల నుంచి కాపాడుకోవడానికి సంకేతం. ఒక పౌరుడిగా నాకు ఇది ఆందోళన కలిగించే విషయం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ దిశ అరెస్ట్ దారుణమని వ్యాఖ్యానించారు. "ఇది అనవసరంగా వేధింటం. భయపెట్టడం. దిశా రవికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
దిల్లీ పోలీసులు ఏమంటున్నారు
దిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో "దిశా రవిని దిల్లీ పోలీస్ సైబర్ టీమ్ అరెస్ట్ చేసింది. ఆ టూల్ కిట్కు ఆమె ఎడిటర్. డాక్యుమెంట్ను తయారు చేసి, దానిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ప్రధాన కుట్రదారు" అని ట్వీట్ చేశారు.
"ఆమె (దిశా రవి) ఈ టూల్ కిట్ రూపొందించడానికి పని చేసే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన టీమ్తో కలిసి పనిచేశారు" అని కూడా దిల్లీ పోలీసులు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
దీనితోపాటూ దిల్లీ పోలీసులు తమ ట్విటర్లో "ఈ ప్రక్రియలో దిశా, ఆమె సహచరులు భారత్కు వ్యతిరేకంగా విద్వేషాలు వ్యాపించేలా ఖలిస్తాన్ అనుకూల 'పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్' అనే సంస్థతో కలిసి పనిచేశారు. ఆ టూల్ కిట్ డాక్యుమెంట్ను గ్రెటా థన్బర్గ్తో షేర్ చేసుకుంది దిశానే. తర్వాత దానిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని గ్రెటాకు చెప్పింది కూడా దిశానే. దానిలోని కొన్ని రెచ్చగొట్టే భాగాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి" అని రాశారు.
ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న టూల్కిట్ డాక్యుమెంట్ గురించి తెలిసిన తర్వాత తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఫిబ్రవరి 4న దిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చారు.
జనవరి 26న జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
వారి వివరాల ప్రకారం భారత్కు వ్యతిరేకంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ యుద్ధం రెచ్చగొట్టడానికి ఈ టూల్ కిట్ పిలుపునిచ్చింది.
ఈ టూల్కిట్ మీద పనిచేసిన వారి వివరాలు సేకరించడానిక గూగుల్ను సంప్రదిస్తామని కొన్ని రోజుల క్రితం దిల్లీ పోలీసులు చెప్పారు.
మొదట్లో దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో గ్రెటా థన్బర్క్ పేరు కూడా చేర్చారనే వదంతులు వచ్చాయి. కానీ తర్వాత పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో ఎవరి పేరూ లేదని, దానిని అనామకులపై నమోదు చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/gretathunbergsweden
ప్రభుత్వం కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటోంది
'కలెక్షన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఇన్ ఇండియా' అనే సంస్థ దిశ అరెస్టు తర్వాత ఒక ప్రకటన జారీ చేసింది.
"కేంద్ర ప్రభుత్వం యువతను, పర్యావరణ కార్యకర్తలను టార్గెట్ చేసుకోవడం ఆపాలి. దేశంలో పర్యావరణ, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి" అని అందులో చెప్పింది.
దిశా రవి అరెస్ట్ సమర్థనీయం కాదు. దిల్లీ పోలీసులు నియమాలను పాటించడంలేదనేది దాచాల్సిన విషయమేం కాదు. కానీ దిశ అరెస్ట్ ఖండించదగినది. ఇది రాజ్యాంగ సిద్ధాంతాలను ధిక్కరిచడమే" అంది.
"భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలు, ప్రజాస్వామ్యం గొంతు నులమడంతో సమానం" అని కూడా అది తన ప్రకటనలో చెప్పింది.

ఫొటో సోర్స్, Reuters
టూల్కిట్ అంటే ఏంటి?
అమెరికాలో జరుగుతున్న 'బ్లాక్ లైవ్ మేటర్స్', 'యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్' అయినా, పర్యావరణానికి సంబంధించిన 'క్లైమెట్ స్ట్రైక్ కాంపెయిన్' అయినా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలు అయినా, వేరే ఉద్యమాలు అయినా వీటన్నింటికీ సంబంధించి కొన్ని యాక్షన్ పాయింట్స్ రూపొందిస్తారు. అంటే, ఉద్యమం ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సిన కొన్నింటిని ప్లాన్ చేసుకుంటారు.
ఒక డాక్యుమెంట్లో ఆ యాక్షన్ పాయింట్స్ నమోదు చేసుకుంటారు. దానినే 'టూల్కిట్' అంటారు.
ఈ డాక్యుమెంట్ కోసం సోషల్ మీడియాలో 'టూల్కిట్' అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ, అందులో సోషల్ మీడియా వ్యూహంతోపాటూ, శారీరకంగా సామూహిక ప్రదర్శనలు చేయడానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తుంటారు.
ఉద్యమం ప్రభావాన్ని పెంచడానికి ఎవరు సాయపడతారని అనుకుంటారో, వారి మధ్య ఈ టూల్కిట్ను తరచూ షేర్ చేస్తుంటారు.
అలాంటప్పుడు టూల్కిట్ అనేది ఒక ఉద్యమ వ్యూహానికి కీలకం అని చెప్పడం తప్పు కాదు. మనం గోడలకు అతికించే పోస్టర్ల ఆధునిక రూపంగా టూల్కిట్ను పిలవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచీ ఉద్యమాలు చేసినవారు, దాని గురించి చెప్పడానికి, ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వడానికి వాటిని ఉపయోగిస్తున్నారు.
సోషల్ మీడియాలో మార్కెటింగ్ నిపుణుల ప్రకారం ఈ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశం ప్రజలను( ఉద్యమ మద్దతుదారుల్లో) సమన్వయం చేయడం. టూల్కిట్లో సాధారణంగా జనాలు ఏం రాయచ్చు, ఎలాంటి హాష్ట్యాగ్ ఉపయోగించవచ్చు, ఏ సమయంలో ట్వీట్ లేదా పోస్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎవరెవరిని ట్వీట్స్, ఫేస్బుక్ పోస్టుల్లో చేర్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనేది చెబుతారు.
దిశా రవిని కసబ్తో పోల్చిన బీజేపీ ఎంపీ
బీజేపీ సీనియర్ నేత, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ పర్యావరణ కార్యకర్త దిశా రవిని ముంబయి 26/11 దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ తీవ్రవాది మహమ్మద్ అజ్మల్ ఆమిర్ కసబ్తో పోల్చారు.

ఫొటో సోర్స్, Twitter
"బుర్హాన్ వానీకి కూడా 21 ఏళ్లే. అజ్మల్ కసబ్కు కూడా 21 ఏళ్లే. వయసు ఒక అంకె మాత్రమే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు. చట్టం తన పని చేసుకుపోతుంది. ఒక నేరం, ఎప్పుడూ నేరమే అవుతుంది" అని పీసీ మోహన్ ట్వీట్ చేశారు.
తన ఈ ట్వీట్తోపాటూ ఆయన #DishaRavi ని ఉపయోగించారు. దిశా రవి ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు.
"దిశా రవిని వెనకేసుకొస్తున్న వాళ్లు, దిల్లీ పోలీసుల ప్రకటన చదివితే బాగుంటుంది" అన్నారు. ఆయన పోలీసులు ట్వీట్ కూడా షేర్ చేశారు.
బీజేపీ ఎంపీ పీసీ మోహన్ విదేశాంగ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో సభ్యులు కూడా. ఆయన ట్వీట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











