దేశంలో కరోనా మృతుల సంస్మరణ కోసం ఆన్లైన్ మెమోరియల్

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంస్మరణ కోసం కొందరు వైద్యులు, సామాజిక కార్యకర్తలతో కూడిన బృందం ఒక ఆన్లైన్ మెమోరియల్ను ప్రారంభించింది.
మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వర్చువల్ మెమోరియల్లో తమ నివాళులు అర్పించటానికి వీలుంటుంది.
భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇటీవలి నెలల్లో కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.
ఈ ఆన్లైన్ మెమోరియల్ను నిర్వహించటానికి సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సాయం చేస్తారు.
నేషనల్ కోవిడ్ మెమోరియల్ డాట్ ఇన్ - nationalcovidmemorial.in – వర్చువల్ మెమోరియల్ను కొందరు వైద్యుల బృందం సారథ్యంలోని కోవిడ్ కేర్ నెట్వర్క్ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ గత వారాంతంలో కోల్కతాలో ఆవిష్కరించింది.
ఈ సైట్లో ఇప్పటికే నివాళులు పోస్ట్ చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయటమో, లేదంటే ధృవీకరించుకోవటానికి వీలుగా తమ ఫోన్ నంబర్ను అందించటమో చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, National Covid Memorial
‘‘మహమ్మారికి బలైన తమ ప్రియతముల జ్ఞాపకాలను సజీవంగా ఉంచటం కోసం ఈ నేషనల్ కోవిడ్ మెమోరియల్ను ప్రారంభించాం. ఇందులో భారతీయులందరూ చేరవచ్చు’’ అని సదరు నెట్వర్క్ ప్రతినిధి డాక్టర్ అభిజిత్ చౌదురి చెప్పారు.
‘‘కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో చనిపోయి, తమ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం లేకుండా అంత్యక్రియలు పూర్తైన వారికి కొంతైనా గౌరవాన్ని ఈ మెమోరియల్ పునరుద్ధరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి అంత్యక్రియలకు వారి కుటుంబ సభ్యులను చాలా వరకూ అనుమతించలేదు. ఆ సమయంలో వివక్ష, భయం ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ వైద్యుడు కోవిడ్ కారణంగా చనిపోయినపుడు ఆయన మృతదేహాన్ని సమాధి చేయటాన్ని ఒక బృందం హింసాత్మకంగా అడ్డుకుంది.
ఈ వైరస్ వల్ల చనిపోయిన ‘‘పేదలు, అభాగ్యుల’’కు నివాళులు సమీకరించటానికి వలంటీర్లు, ఎన్జీఓలు, పాత్రికేయులు అవసరమవుతారని ద హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎన్.రామ్ పేర్కొన్నారు.
‘‘ఈ మెమోరియల్ సమ్మిళతంగా ఉండాలి. మనం ఏ ఒక్కరినీ వదిలివేయకూడదు’’ అన్నారాయన.
మరణించిన వారి సంస్మరణ సంప్రదాయం భారతదేశంలో లేదని ఈ మెమోరియల్ వ్యవస్థాపకులకు సలహాదారుగా వ్యవహరిస్తున్న వైద్యుడు వి.మోహన్ పేర్కొన్నారు.
‘‘స్మారకాల సంప్రదాయం మనకు లేదు. చనిపోయినవారిని మేం గుర్తుచేసుకోం. కోవిడ్ కలిగించిన విషాదం, మానసిక వేదన ప్రభావిత కుటుంబాలలో దశాబ్దాల పాటు కొనసాగుతుంది. అలాంటి ప్రజలు సందర్శించటానికి, తమ జ్ఞాపకాలను మళ్లీ జీవించటానికి ఈ వర్చువల్ మెమోరియల్ ఒక కేంద్రం అవుతుంది. ఇది ఒక జాతీయ ఉద్యమం కావాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కొత్త రకాల మీద కూడా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్...
- మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- స్పేస్ ఎక్స్ ప్రపంచ రికార్డ్: ఒకే రాకెట్లో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం
- అజింక్య రహానె: భారత్ క్రికెట్కు కెప్టెన్ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
- ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’ - అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ
- హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్కు సహకరించదు'
- నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
- ఏ వెలుగు మంచిది? సహజమైనదా, కృత్రిమమైనదా?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








