ఏనుగు మరణం: గర్భంతో ఉన్న ఏనుగును పేలుడు పదార్థాలు తినిపించి చంపేశారు

ఫొటో సోర్స్, MOHAN KRISHNAN
కేరళలో నీలంబూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఏనుగుకు కొందరు పేలుడు పదార్ధాలు నింపిన అనాసపండుని తినిపించారు. అది తిన్న ఏనుగు చనిపోయింది.
సుమారు14-15 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
గాయపడిన తరువాత వెల్లియార్ నదిలో మూడు రోజులుగా చిక్కుపడిపోయిన ఆ ఏనుగుని బయటకి తీసుకుని రావడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఏనుగు తొండంతో సహా నీటిలో కూరుకుపోయింది.
"ఏనుగుకి గాయం ఎక్కడయిందో కూడా మాకు అర్ధం కాలేదు. అది నీటిలో చిక్కుకుని ఉన్నంత సేపు కేవలం నీరు మాత్రమే తాగింది. ఏనుగు దవడల రెండు వైపులా బాగా గాయాలై దాని దంతాలని కూడా కోల్పోయినట్లు” పాలక్కాడ్ లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ , వన్య జీవుల సంరక్షకుడు శామ్యూల్ పచావ్ చెప్పారు.
ఆ ఏనుగు మే 25వ తేదీన దగ్గరలో ఉన అడవుల్లోకి ఆహారం కోసం వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళినప్పుడు పొరపాటున నీటిలో చిక్కుపడి బయటకి రాలేకపోయిందని, కడుపులో ఉన్న బిడ్డకి ఆహారం కోసం ఆ పండు తిని ఉండవచ్చని పాలక్కాడ్ జిల్లా మన్నార్కాడ్ అటవీ శాఖ అధికారి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
రాపిడ్ రెస్పాన్స్ టీం కి చెందిన మోహన్ కృష్ణన్ అనే అటవీ శాఖ అధికారి రాసిన ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, MOHAN KRISHNAN
ఆ ఏనుగు ఎంత మంచిదో ఆయన ఫేస్ బుక్ పోస్ట్ లో రాస్తూ దానికి గాయాలైనప్పటికీ గ్రామ వీధుల్లో నొప్పితో పరుగు పెట్టింది కానీ, ఎవరికీ హాని చేయలేదని రాసారు . ఆ ఏనుగు ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.
అయితే ఆ ఏనుగు అనుభవించిన బాధని, వేదనని ఆ ఫోటోలలో బంధించలేకపోయారు.
ఏనుగుని చిక్కుపడిన నీటిలోంచి బయటకి తీసుకుని వచ్చి వైద్యం చేయడానికి రాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని, రెండు శిక్షణ పొందిన ఏనుగులని తెప్పించినప్పటికీ దానిని రక్షించలేకపోయామని సునీల్ కుమార్ చెప్పారు. దానికి వైద్యం అందించే లోపే అది మరణించిందని తెలిపారు.
మే 27 వ తేదీన నీటిలో ఉండగానే అది మరణించినట్లు అధికారులు తెలిపారు. దానికి పోస్ట్ మోర్టమ్ నిర్వహిస్తున్నపుడు అది గర్భం తో ఉన్న విషయం బయటపడినట్లు చెప్పారు.
మరణించిన ఏనుగుతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించినట్లు ఈ ఏనుగుకి పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన డాక్టర్ చెప్పినట్లు కృష్ణన్ తన ఫేస్ బుక్ పోస్టులో రాసారు . "డాక్టర్ ముఖం మాస్క్ తో కప్పి ఉండటం వలన కళ్ళల్లో విచారం కనిపించలేదు గాని, ఆయన గొంతులో బాధ ధ్వనించింది".
అక్కడే ఏనుగుకి అంత్యక్రియలు నిర్వహించి ఆఖరి వీడ్కోలు పలికినట్లు ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దీనికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పచావ్ తెలిపారు.
నీలంబూర్ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు మనుషుల మధ్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది కానీ, పేలుడు పదార్ధాలతో ఏనుగుని అంతమొందించడం మాత్రం ఇదే మొదటిసారని పచావ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- రష్యా: తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా
- కరోనావైరస్ సమయంలో తట్టు కూడా ప్రబలే ప్రమాదముందా
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- ‘80 ఏళ్ల క్రితం అంటువ్యాధులపై మా డాక్టర్ తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా’
- కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా.. ఆన్లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








