కశ్మీర్: ‘40 ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నా.. ఇప్పుడు సొంత భూమి కొనుక్కోవచ్చంటున్నారు’: బీబీసీతో ధాబా యజమాని

ఫొటో సోర్స్, AFP/getty images
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక కశ్మీర్కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
అక్కడున్న అన్ని ఫోన్ లైన్లు, ఇంటర్నెట్ స్తంభించాయి. వరసగా రెండో రోజూ కశ్మీర్లో లాక్డౌన్ కొనసాగుతోంది.
కశ్మీర్లోని స్కూళ్లు, వ్యాపార సంస్థలు కూడా మూతబడ్డాయి. రహదారులపై వేల సంఖ్యలో సైనికులు గస్తీ కాస్తున్నారు. స్థానిక నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్లోని ఒక ప్రాంతంలో 1980 నుంచి దాబా నడుపుతున్న ఒక బిహార్ వ్యక్తితో బీబీసీ మాట్లాడింది.

అక్కడ పరిస్థితి అతడి మాటల్లోనే...
నేను బిహారీని, 1980వ దశకం నుంచీ కశ్మీర్లోని ఈ ప్రాంతంలో ధాబా నడుపుతున్నాను.
నా ధాబాలో తినడానికి సైనికులతోపాటు, సామాన్యులు కూడా వస్తుంటారు.
నేను 1990లో మిలిటెన్సీని కూడా చూశాను. కానీ ఇలాంటి పరిస్థితిని మాత్రం ఎప్పుడూ చూళ్లేదు.
శ్రీనగర్ దగ్గర నేనున్న ప్రాంతంలో పరిస్థితులు నగరంలో కంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ సైనికులను చాలా భారీగా మోహరించారు.
కానీ నగరంలో దిగువ ప్రాంతాల్లో ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితి ఘోరంగా ఉంది. అన్నీ మూసేశారు. అక్కడ ఏం జరుగుతోందో ఏం తెలీడం లేదు.
ఇక్కడ కరెంటు ఉంది. కమ్యూనికేషన్ మాత్రం కట్ చేశారు. నేను న్యూస్ కూడా చూళ్లేకపోతున్నా.

ఫొటో సోర్స్, EPA
పనులకు వచ్చినవారు వెనక్కు వెళ్తున్నారు...
మొదట్లో కశ్మీర్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మూతపడ్డాయి. పనులు ఆగిపోయాయి.
బయటి నుంచి పనులకు వచ్చిన వాళ్లంతా వెనక్కు వెళ్లిపోతున్నారు. వాళ్ల నుంచి ఎలాంటి రవాణా చార్జీలు కూడా తీసుకోవడం లేదని తెలిసింది.
నా ధాబాలో తినడానికి ఇప్పుడు ఎక్కువగా జవాన్లే వస్తున్నారు. సామాన్యులెవరూ రావడం లేదు.
1990వ దశకంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ ఎలాంటి సమస్యా రాలేదు.
ఇక్కడ కశ్మీరీలు నాతో చాలా బాగా ప్రవర్తిస్తారు. అందరూ బాగా మాట్లాడుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి భయంభయంగా ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తంగా ఉంది.
370ని రద్దు చేసిన తర్వాత కొంతమంది కశ్మీరీ స్నేహితులు నాతో సరదాగా "మీరిప్పుడు ఇక్కడ మీకోసం సొంత భూమి కూడా కొనుక్కోవచ్చు" అని అంటున్నారు.
నేను 40 ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నా. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా, నేను ఇక్కడే ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- సుష్మా స్వరాజ్ ‘తెలంగాణ చిన్నమ్మ’ ఎలా అయ్యారు? రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర ఏంటి?
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్ ఉద్రిక్తం: కొత్త సంక్షోభం రావచ్చన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్
- ‘పాకిస్తాన్... మీ జవాన్ల మృతదేహాలను తీసుకువెళ్ళండి‘ -భారత్
- కశ్మీర్: గృహనిర్బంధం తర్వాత మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఎమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








