జగన్ ప్రెస్ మీట్: 'నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా'

జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు.

ఇంత భారీ మెజార్టీ రావడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అయ్యుంటుందని జగన్ అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

  • దేశ చరిత్రలోనే ఇది గొప్ప విజయం
  • మొత్తం ఎంపీ స్థానాలు 25 రావడం, 175 నియోజకవర్గాలలో 151 రావడం రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం.
  • ఈ విజయం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైంది.
  • ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతలను, విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది.
  • ఇది ప్రజలు విశ్వసనీయతకు వేసిన ఓటు.
  • విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు.
  • అయిదు కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి ఇస్తాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఆ అవకాశం మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది.
  • ఆ అవకాశం ఒక్కరికి వచ్చినప్పుడు... గవర్నమెంటు అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఏమిటో చూపిస్తాను.
  • జగన్ అందరికన్నా మంచి ముఖ్యమంత్రిగా మీ అందరితో మన్ననలు అందుకుంటానని మనవి చేస్తున్నా.
  • ఈ సందర్భంగా ప్రజలందరికీ రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
  • ఆరు నెలల నుంచి ఏడాది లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటానని మాటిస్తున్నా.
  • ఈనెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తా.
పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)