ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయనగరంలో అత్యధికంగా 74.18 శాతం పోలింగ్.. విశాఖలో అత్యల్పంగా 55.82 శాతం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
ఇప్పటివరకు అత్యధికంగా విజయనగరంలో 74.18 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 55.82 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం 5గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల వీటిని సరిచేయగలిగారు.
సాంకేతిక కారణాలతో 381 ఈవీఎంలు మొరాయించాయని.. అవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని ఈసీ ద్వివేది తెలిపారు.
20 చోట్ల ఘర్షణలు జరిగాయని, ఒక హత్య జరిగిందని ద్వివేది చెప్పారు.
ఈవీఎంలు పనిచేయకపోవడం పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపిందని టీడీపీ నేత చంద్రబాబు ఆరోపించారు. 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








