ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 41 రోజుల్లో 24 కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం

మద్యపానం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ఓటర్లకు భారీగా పంచడానికి తీసుకున్న మద్యం బాటిళ్లను సీజ్ చేసిన అధికారులు, పోలింగ్ రోజు వరకూ పట్టుబడిన మొత్తం మద్యం వివరాలను వెల్లడించారు.

మార్చి 1 నుంచి ఎన్నికల తేదీ వరకూ జిల్లాల వారీగా ఎన్ని లీటర్ల మద్యం పట్టుబడింది, దాని మొత్తం విలువ ఎంత అనేదానిపై అధికారులు లెక్కలు విడుదల చేశారు.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 70 లక్షల విలువ చేసే మద్యం పట్టుకున్న అధికారులు మొత్తం 1176 కేసులు నమోదు చేశారు.

జిల్లాల వారీగా అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం(లీటర్లలో), నమోదైన కేసులు, వాటి మొత్తం విలువ

మద్యం స్వాధీనం చేసుకున్న సమయంలో దాదాపు ఆరు వేల మందిని అరెస్టు చేశామని, 760 వాహనాలను సీజ్ చేశామని కూడా అధికారులు తెలిపారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)