సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యార్లగడ్డ అమరేంద్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి
సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. దీన్ని జనవరి 15వ తేదీన వర్య్చువల్ గా మోదీ ప్రారంభించారు.
సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలు టైమింగ్స్ ఏంటి..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య రైలు ప్రయాణ సమయం 8.30 గంటలు.
రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు ఉన్నాయి.
ఈ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
సికింద్రాబాద్ నుంచి 02701 నంబరుతో ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి నుంచి 02702 నంబరుతో మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నాలుగు స్టాపులున్నాయి.
అవి నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.
ఇందులో నల్లగొండ, ఒంగోలు, నెల్లూరులో నిమిషం చొప్పున ఆగుతుంది.
గుంటూరులో ఐదు నిమిషాలు ఆగుతుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు ఇలా
ఉదయం
6.00 – సికింద్రాబాద్
7.19 – నల్లగొండ
9.45 – గుంటూరు
11.09 – ఒంగోలు
మధ్యాహ్నం
12.29 – నెల్లూరు
2.30 – తిరుపతి
తిరుపతి నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు
మధ్యాహ్నం
3.15 గంటలు – తిరుపతి
సాయంత్ర
5.20 – నెల్లూరు
6.30 – ఒంగోలు
రాత్రి
7.45 – గుంటూరు
10.10 – నల్లగొండ
11.45 - సికింద్రాబాద్

ఫొటో సోర్స్, Getty Images
టికెట్ ధర ఎంత..?
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర ఛైర్ కార్ లో రూ.1680 గా రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇందులో బేస్ ఫేర్ – రూ.1168
రిజర్వేషన్ ఛార్జీలు – రూ.40
సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.45
జీఎస్టీ – రూ.63
క్యాటరింగ్ ఛార్జీలు – రూ.364
అలాగే ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీ రూ.3080గా ఉంది.
ఇందులో బేస్ ఫేర్ – రూ.2399
రిజర్వేషన్ ఛార్జీలు – రూ.60
సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.75
జీఎస్టీ – రూ.125
క్యాటరింగ్ ఛార్జీలు – రూ.419

ఫొటో సోర్స్, Getty Images
దూరం ఎంత..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలు.
ఇది రెండు నగరాల మధ్య ధూరం 660.7 కిలోమీటర్లు
ఈ రైలు అన్ని రోజులు నడవదు.
వారానికి ఆరు రోజులే నడుస్తుంది.
నిర్వహణ కోసం మంగళవారం సెలవు ఉంటుంది.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పోల్చితే సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణం సమయం దాదాపు 4 గంటలు ఆదా అవుతందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు 12 నుంచి 12.30 గంటల ప్రయాణ సమయం ఉండగా.. వందే భారత్ రైలు కేవలం 8.30 గంటలలోనే చేరుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్పింగ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















