పాబ్లో పికాసో: తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏథెన్స్‌లో దొరికిన పికాసో పెయింటింగ్

పికాసో పెయింటింగ్

ఫొటో సోర్స్, NATIONAL ART GALLERY

ఫొటో క్యాప్షన్, ఈ రెండు పెయింటింగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఏథెన్స్ పోలీసులు చెప్పారు.

చోరీకి గురైన పాబ్లో పికాసో పెయింటింగ్‌ ఒకటి ఇప్పుడు ఏథెన్స్‌లో దొరికింది.

ఈ పెయింటింగ్ గ్రీక్ గ్యాలరీ నుంచి తొమ్మిది సంవత్సరాల క్రితం చోరీకి గురైంది.

పికాసో వేసిన 'మహిళ తల' పెయింటింగ్‌తో పాటు పీట్ మాండ్రియన్ అనే డచ్ ఆర్టిస్ట్ 1905లో వేసిన మరో పెయింటింగ్ కూడా దొరికిందని ఏథెన్స్ పోలీసులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా ?

2012లో ఏథెన్స్ నేషనల్ గ్యాలరీ నుంచి ఈ రెండు పెయింటింగ్‌లతో పాటు మరొకదాన్ని దొంగిలించారు.

నగర శివార్లలోని ఇరుకైన ఒక లోయ దగ్గర దాచిపెట్టిన ఈ పెయింటింగ్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక గ్రీక్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.

ఈ కళాఖండం తమ దేశంలోనే ఉంటుందని భావిస్తున్నట్లు గ్రీక్ పోలీసులు చెప్పిన కొన్ని నెలల్లోనే, వాళ్లు దాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)