రెస్ట్ తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి
పెద్దపులి హాయిగా సేదతీరుతున్న ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో ఈ వీడియోను చిత్రీకరించారు.
తర్వాత, ఈ పులి పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు.
అంతకుముందు కాకినాడ జిల్లా ఏలేరు ప్రాంతంలో పశువులపై దాడి చేసిందని.. అనంతరం దిశ మార్చుకుని బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఈ పెద్దపులి మెడలో రేడియో కాలర్ ఉంది. దాని నుంచి వచ్చే సిగ్నళ్ల ఆధారంగా పులి ఎటు వెళ్తోందో ట్రాక్ చేస్తున్నారు.
నాగార్జునసాగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ సహా ఐదు బృందాలతో ఈ పెద్దపులిని బంధించేందుకు ఆపరేషన్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









