కేటీఆర్- విజయసాయి రెడ్డి: పంట పొలాల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఒకే ఫొటో ట్వీట్ చేసిన ఇద్దరు నాయకులు, అసలు ఈ ఫొటో ఏ రాష్ట్రానిది?

పొలంలో రైతుకు టీకా వేస్తున్న ఫొటో

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని చెప్పడానికి మంత్రి కేటీఆర్ ఉపయోగించిన ఫొటో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

'రెండు ఫొటోలు. ఒకటి ఖమ్మం జిల్లాలోది. మరొకటి రాజన్న సిరిసిల్లా జిల్లాలోది. కానీ ఈ రెండు ఫొటోల్లో హెల్త్ కేర్ వర్కర్ల కమిట్‌మెంట్ కనిపిస్తోంది' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హెల్త్‌కేర్ వర్కర్లకు ఆయన అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కేటీఆర్ ట్వీట్ చేసిన ఫొటోల్లో పొలంలో పని చేస్తున్న వారిని ఆ పొలంలోనే నిలబెట్టి హెల్త్‌కేర్ సిబ్బంది వ్యాక్సీన్ వేస్తోన్న దృశ్యం కనిపిస్తోంది.

అయితే, కేటీఆర్ ట్వీట్‌ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మూడు రోజుల క్రితం ఇదే ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందనడానికి నిదర్శనమంటూ ఆయన కూడా ఇదే ఫొటోను ఉపయోగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్)లో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయి ట్వీట్ చేసిన మూడు రోజుల తరువాత ఇప్పుడు కేటీఆర్ అదే ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

కేటీఆర్ ఒక్కరే కాదు ఒక తెలుగు దిన పత్రిక తన జిల్లా ఎడిషన్‌లో కూడా ఈ ఫోటో ప్రచురించింది. ఇది నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో జరిగినట్టు ఆ పత్రిక రాసింది.

కానీ, తెలుగు దిన పత్రిక చెప్పినట్లు ఆ ఫొటో తమ జిల్లాకు చెందినది కాదని నారాయణ పేట జిల్లా వైద్యాధికారి రామ్మోహన రావు బీబీసీకి చెప్పారు.

కేటీఆర్ ట్వీట్ చేసిన రెండో ఫొటో

ఫొటో సోర్స్, Twitter

ఈలోపు ఈ వాక్సినేషన్ ఫొటోలపై సోషల్ మీడియా యూజర్లలో గందరగోళం మొదలైంది.

విజయసాయిరెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకే ఫొటోను ట్వీట్ చేయడం గురించి చాలా మంది ప్రశ్నించారు.

కొందరు ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వ్యాక్సినేషన్ అంటూ కూడా ట్వీట్ చేశారు.

బీబీసీ పరిశీలనలో కూడా ఈ ఫొటో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వ్యాక్సినేషన్‌కు సంబంధించినదే అని తెలిసింది. ఈ విషయాన్ని విజయనగరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్‌వీ రమణకుమారి బీబీసీకి ధృవీకరించారు.

ఆ ఫొటోలో ఉన్నది తమ బృందమేనని ఆమె బీబీసీతో చెప్పారు. దీనిని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో తీసిన ఫొటోగా తేల్చారు.

ఇక తను ట్వీట్ చేసిన దానిలో మొదటి ఫోటో (ట్వీట్‌లో ఎడమ వైపు) ఖమ్మం జిల్లాకు చెందినదని కేటీఆర్ చెప్పారు.

అదే ఫొటోను నల్లగొండ జిల్లాలో జరిగిన వ్యాక్సినేషన్‌కు సంబంధించింది అంటూ మరో తెలుగు పత్రిక రాసింది. అయితే, ఆ ఫొటో ఖమ్మం, నల్లగొండ రెండు జిల్లాలకు సంబంధించినది కాదని తేలింది.

ఆ విషయాన్ని ఖమ్మం డీఎంహెచ్ఓ, నల్గొండ డీఎంహెచ్ఓ బీబీసీకి ధృవీకరించారు.

మరోవైపు, రెండు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే తాను ఆ ట్వీట్ చేసినట్లు మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.

తెలంగాణ హెల్త్‌కేర్ వర్కర్లు అద్భుతంగా పని చేస్తున్నారని, వారిని అభినందిద్దామని ఆయన అన్నారు.

కేటీఆర్ ట్వీట్ చేసిన రెండో ఫొటో

ఫొటో సోర్స్, Twitter/ktr

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)