పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌‌జిత్ సింగ్ చన్నీ

చరణ్‌జిత్ సింగ్ చన్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ పేర్కొన్నారని ఏఎన్ఐ తెలిపింది.

దళిత సిక్కు కమ్యూనిటీకి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ ప్రభుత్వం లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై ముఖ్యమంత్రి కాబోతున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దు రాష్ట్రం భద్రత విషయంలో ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

చరణ్‌జిత్ సింగ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు చండీగఢ్‌లోని గవర్నర్ నివాసం ముందు సంబరాలు చేసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అంతకు ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలన్నదానిపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేసింది.

దిల్లీ నుంచి వచ్చిన పరిశీలకుల బృందం చండీగఢ్‌లో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్నదానిపై మంతనాలు జరిపారు.

అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ మంత్రిగా పని చేశారు.

ఫొటో సోర్స్, Gulshan Kumar

ఫొటో క్యాప్షన్, అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ మంత్రిగా పని చేశారు.

పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావా కావచ్చని మొదట ఊహాగానాలు వినిపించాయి. ఎక్కువమంది ఎమ్మెల్యేలు రంధావా పేరుకు మద్దతిచ్చారని సమావేశంలో పాల్గొన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే రంధావా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారంటూ ఏఎన్ఐ వెల్లడించింది. దీంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్న ఊహాగానాలు సాగాయి. కానీ చివరకు చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమని, దీనిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆ తర్వాత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా మీడియాతో అన్నారు.

మరోవైపు పంజాబ్‌కు ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని, అందులో ఒకరు హిందు, మరొకరు దళితుడు అయ్యే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దిల్లీలోనూ చర్చలు

మరోవైపు దిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమైన పార్టీ సీనియర్లు పంజాబ్ కొత్త సీఎం ఎంపికపై మంతనాలు జరిపారు. పంజాబ్ కాంగ్రెస్ పరిశీలకులు హరీశ్‌ చౌదరి, అజయ్ మాకెన్‌లు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరకు చన్నీని ఎంపిక చేశారు.

అంతకు ముందు సీఎం పగ్గాలు చేపట్టాల్సిందిగా అంబికా సోనీకి అధిష్టానం సూచించినా ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఒక సిక్కు వ్యక్తి మాత్రమే ఉండాలని తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ శనివారంనాడు రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, CAPT AMARINDER SINGH/TWITTER

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు.

బీజేపీ విమర్శలు

ఒక పక్క సీఎం అభ్యర్ది నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతుండగా, బీజేపీ నేతలు కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్‌ సింగ్ దేశద్రోహం ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని బీజేపీ నేత ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో రాహుల్, ప్రియాంకలు స్పందించాలని జావ్‌డేకర్ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)