తెలంగాణ: మామిడి కాయలు కోశారన్న అనుమానంతో ముఖానికి పేడ పూసి తినిపించారు...పోలీసుల అదుపులో నిందితులు

తెలంగాణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిందితులను మీడియా ముందుకు తెచ్చిన పోలీసులు

మామిడి తోటలో దొంగతనం చేయడానికి వచ్చారన్న అనుమానంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఇద్దరు చిన్నారులపై దాడి ఘటన సంచలనం సృష్టించింది.

దీనిపై స్పందించిన పోలీసులు వారిపై చర్యలు చేపట్టారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, UGC

మైనర్‌ బాలలపై దాడికి పాల్పడిన బానోత్‌ యాకుబ్‌, బానోత్‌ రాములు అనే ఇద్దరు వ్యక్తులపై సెక్షన్‌ 342, 324, 504తోపాటు జువైనల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్‌ 75 కింద కేసులు నమోదు చేశారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, UGC

అసలేం జరిగింది?

పోలీసులు అందించిన వివరాల ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని సాయి నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్‌ బాలురు తమ పెంపుడుకుక్క కనబడకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ కంటాయపాలెం రోడ్డు దగ్గర్లోని ఓ మామిడి తోటలోకి వెళ్లారు.

అయితే, తోటకు కాపలాగా ఉంటున్న బానోత్‌ యాకుబ్, బానోత్‌ రాములు... వీరిద్దరు మామిడి కాయల దొంగతనానికి వచ్చారని అనుమానించి వారిని తాళ్లతో కట్టి కర్రతో తీవ్రంగా కొట్టారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, UGC

ఇద్దరి ముఖానికి పశువుల పేడను పూసి, వారితో తినిపించారు.

ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ఘటనంతా వీడియో తీసి వాట్సాప్‌ గ్రూప్‌లలో పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)