హాథ్‌రస్: దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారన్న సీబీఐ... దాఖలైన చార్జిషీట్

హాథ్‌రస్

ఫొటో సోర్స్, PRAKASH SINGH

ఉత్తర ప్రదేశ్‌లోని హథ్‌రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం జరిగిందని పేర్కొంటూ.. ఈ కేసులో నిందితులైన సందీప్, లవ్‌కుశ్, రవి, రాములపై అత్యాచారం, హత్య నేరాలను సీబీఐ అధికారులు నమోదు చేశారు.

అలహాబాదు హై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గాంధీనగర్‌లోని ఫోర్నెసిక్ సైన్స్ ల్యాబొరెటరీలో నలుగురికీ వివిధ రకాల పరీక్షలు జరిపినట్లుగా సీబీఐ తెలిపింది.

అంతేకాకుండా, మృతురాలికి చికిత్స చేసిన జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్ వైద్య సిబ్బందితో కూడా మాట్లాడినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

హాథ్‌రస్

ఫొటో సోర్స్, Gopal Shoonya/BBC

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలతో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఈ కేసులో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు..మృతురాలి కుటుంబం అనుమతి లేకుండా, వారు దగ్గర లేని సమయంలో అంత్యక్రియలు జరిపించడం వివాదాస్పదమమైంది.

అంతేకాకుండా, నిందితుల పక్షం వహించి..కొన్ని గ్రామాల్లో మహాపంచాయితీ ఏర్పాటు చెయ్యడం కూడా వివాదాస్పదమయ్యింది.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం…బాధితుల గ్రామంలోకి మీడియా ప్రవేశించకుండా కొంతకాలం అడ్డుకుంది.

హాథ్‌రస్

ఫొటో సోర్స్, Gopal Shoonya/BBC

బాధితురాలి కుటుంబంపై నార్కో టెస్ట్ జరపడం గురించి కూడా యూపీ ప్రభుత్వం మాట్లాడింది. సాధారణంగా నిందితులపై నార్కో టెస్ట్ జరుపుతారు.

ఈ రకమైన వైఖరితో యూపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈ కేసులో ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్)ను ఏర్పాటు చేసారు. తరువాత ఈ కేసును సీబీఐకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)