కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం

కన్హయ్య కుమార్

ఫొటో సోర్స్, Getty Images

జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా నమోదైన దేశ ద్రోహం కేసులో విచారణ జరిపేందుకు దిల్లీ ప్రభుత్వం పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.

దిల్లీ పోలీసు వర్గాల నుంచి ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కన్హయ్యకుమార్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణ జరగాలని కోరుకుంటున్నానని, దేశద్రోహ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో అందరికీ తెలియాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

2016, ఫిబ్రవరి 9న దిల్లీలోని జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

ఈ కేసులో కన్హయ్యతోపాటు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచర్య కూడా నిందితులుగా ఉన్నారు.

చార్జ్ షీట్

ఫొటో సోర్స్, Twitter

గత ఏడాది జనవరి 14న దిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తుకు అనుమతి మంజూరు చేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని రాతపూర్వకంగా కోరారు. కానీ, దిల్లీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

కొన్ని రోజుల క్రితం అనుమతి మంజూరు చేసేలా దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టు‌ను పోలీసులు ఆశ్రయించారు. కానీ, ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో పోలీసులకు మార్గం సుగమమైంది.

గత ఫిబ్రవరి 19న పోలీసులు పంపిన అభ్యర్థనకు బదులుగా దిల్లీ ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.