ఆర్థిక సర్వే 2019-20: జీడీపీ వృద్ధి రేటు 2020-21లో 6 - 6.5% ఉంటుందని అంచనా

ఫొటో సోర్స్, Getty Images
మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1న పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజైన శుక్రవారం (జనవరి 31)నాడు ఆర్థిక సర్వే 2019-20ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
- 2020-21 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా.
- ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు 5 శాతంగా ఉంది.
- ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టి వేగవంతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సంపద సృష్టి చాలా ముఖ్యమైన అంశం.
- డిసెంబర్ 2019 నాటికి ద్రవ్యోల్బణం 2.6 శాతానికి తగ్గింది. ఏప్రిల్ 2019న ఇది 3.2 శాతంగా ఉంది.


- జీఎస్టీ వసూళ్లలో 4.1శాతం పెరుగుదల నమోదైంది.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రాబడి మరింత పెరిగే అవకాశం ఉంది.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2019 ఓ క్లిష్టమైన సంవత్సరం. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది.
- రాబోయే సంవత్సరంలో ప్రపంచవ్యాప్త పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉంటాయి.
- భారతీయ రైల్వే వ్యవస్థ అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రపంచ రికార్డు సాధించింది.
- దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కావాలి.
అంతకు ముందు, పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు.
"ఈ దశాబ్దం భారత్కు చాలా ముఖ్యమైనది. ఈ దశాబ్దంలోనే భారత్ స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతాయి. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అవసరమైన చట్టాలు రూపొందించాలి" అని కోవింద్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.
- బడ్జెట్ 2020: ఆదాయ పన్ను భారం తగ్గుతుందా... కొనుగోళ్ళు పెరుగుతాయా?
- నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా
- కునాల్ కమ్రాను నిషేధించిన ఎయిర్లైన్స్.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి
- India vs New Zealand: వరుసగా రెండో టై.. నాలుగో టీ20లోనూ సూపర్ ఓవర్లో భారత్ విజయం
- కరోనావైరస్ను అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





