పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిధి రాయ్,
- హోదా, బీబీసీ బిజినెస్ ప్రతినిధి, ముంబయ్
దేశంలో అందరి కళ్లూ కొన్ని రోజులుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలపైనే ఉన్నాయి. అవి ఎప్పుడు తగ్గుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 7.35 శాతానికి చేరుకుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన 2014 జూలై తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతకు ముందు నెల (నవంబర్)లో 5.54 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే దాదాపు రెండు పాయింట్లు పెరిగింది.
దీనికి ప్రధాన కారణం 60 శాతం మేర పెరిగిన కూరగాయల ధరలే.
ఉల్లిపాయల ధర ఏకంగా 300 శాతం పెరిగింది.
దేశవ్యాప్తంగా అకాల వర్షాలు పడటం, ఉల్లి పంట దెబ్బతినడంతో వాటి ధర ఇలా పెరిగిపోయింది.
బంగాళాదుంపల ధర 45 శాతం పెరిగింది. పప్పులు, తృణ ధాన్యాల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి.
ఈ ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కూడా పడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరిగే ద్రవ్య విధాన సమావేశంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం ఉండాలనే లక్ష్యంతో ఆర్బీఐ ధరల్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంటుంది. 2016లో ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆర్బీఐ తన లక్ష్యాన్ని అందుకుంటూనే ఉంది.
ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించకపోతే, వినియోగదారులపై రుణాల భారం కొనసాగుతుంది. దానివల్ల వారి చేతుల్లో తక్కువ నగదు ఉంటుంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని కోరుకుంటోంది.
కాగా, కూరగాయల సరఫరా మెరుగైందని, కాబట్టి వాటి ధరలు మార్చి నాటికి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, దానికి ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక మందగమనం తోడవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటుంటారు.
భారతదేశం ఇప్పటికీ 4 శాతానికిపైగా వృద్ధి రేటుతో పయనిస్తోందని అంతా చెబుతున్న తరుణంలో, అసలే ఇలాంటి పరిస్థితి మంచిదికాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారా...
- అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణం చవిచూసిన 5 దేశాలు
- ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ప్రభావవంతంగా నియంత్రించిందా...
- కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- భారతదేశం ఆర్థిక మాంద్యానికి అడుగుల దూరంలోనే ఉందా?
- విదేశాల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తే దేశానికి ప్రమాదమా?
- రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది? మీకేమవుతుంది?
- వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం
- జీడీపీ: అంచనాలను మించి అత్యధిక ఆర్థిక వృద్ధి సాధించిన భారత్
- మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2020లో ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?
- ఏబీవీపీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేపథ్యమేంటి?
- పొరుగు దేశాల ముస్లింలను ‘బంధిస్తున్న’ చైనా.. ‘నిర్బంధ క్యాంపుల్లో కొడుతున్నారు, ఏవేవో ఇంజెక్షన్లు చేస్తున్నారు’
- వు హుయాన్: పేదరికం కారణంగా గుప్పెడు అన్నం, పిడికెడు మిరపకాయలు ఐదేళ్లపాటు తిన్న చైనా విద్యార్థిని మృతి
- హైడ్రోజన్తో నడిచే డ్రోన్లు.. ‘ఢీకొట్టినా పేలిపోవు’ అంటున్న హెచ్2గో పవర్
- భారతీయులు తమ నిరసనల్లో రాజ్యాంగాన్ని ఎందుకు పఠిస్తున్నారు?
- ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 'నేల తల్లి బాగుండాలంటే పొదలు కాలిపోవాల్సిందే' అంటున్న ఆదివాసీలు
- #SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








