హైదరాబాద్ అత్యాచారం: 'దిశ' నిందితుల ‘ఎన్కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

ఫొటో సోర్స్, Getty Images
'దిశ' అత్యాచారం, హత్య కేసు నిందితులు శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు.
"విచారణలో భాగంగా నేరం జరిగిన తీరును రీకన్స్ట్రక్ట్ చెయ్యడానికి ఘటనా స్థలానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వద్ద నున్న ఆయుధాన్ని లాక్కొన్న నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితులు నలుగురూ మరణించారు" అని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఈ ‘ఎన్కౌంటర్’కు సంబంధించి పోలీసు అధికారులపై, ప్రత్యేకించి కమిషనర్ వీసీ సజ్జనార్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 'దిశ'కు జరిగిన అన్యాయానికి 10 రోజుల్లోనే న్యాయం జరిగిందంటూ బాధితురాలి తండ్రి కూడా వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కొద్దిగా ఆలస్యం జరిగినా సరైన చర్యే జరిగింది అని ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యానించారు.
నిందితులు తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు పోలీసులకు అంతకు మించిన మార్గం లేదు. న్యాయం జరిగిందనే అనుకోవాలి అని ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగెల్ వ్యాఖ్యానించారు.
"ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ కచ్చితంగా నేరస్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మేం దీన్ని స్వాగతిస్తున్నాం. బిహార్లో కూడా మహిళలపై హింసకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు" అని ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి ఈ ‘ఎన్కౌంటర్’ ఘటనపై వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది? - మేనకా గాంధీ
మరోవైపు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ కూడా దీనిపై స్పందించారు.
"ఇప్పుడు జరిగిన ఘటన చాలా భయానకమైనది. మీరు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపకూడదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. నిందితులకు కోర్టు ద్వారా మరణశిక్ష పడేలా చేయాల్సింది. న్యాయ ప్రక్రియకు ముందే మీరు వారిని కాల్చి చంపాలనుకుంటే, ఇక కోర్టులు, చట్టాలతో పనేముంది?" అని ఆమె అభిప్రాయపడ్డారు.
"పోలీసులు చాలా ధైర్యంగా వ్యవహరించారు. న్యాయం జరిగింది. దీనిపై న్యాయపరమైన ప్రశ్నల సంగతి వేరే అంశం. కానీ, దేశ ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారనిపిస్తోంది" అని బాబారాందేవ్ వ్యాఖ్యానించారు.
"ఎన్కౌంటర్"లు పరిష్కారం కాదు - వరంగల్ ఘటన సందర్భంగా కె.బాలగోపాల్
"నేరస్తులకు శిక్ష పడకపోవడానికి నేర విచారణ వ్యవస్థ కఠినంగా లేకపోవడం కాదు కారణం. నేరపరిశోధనలో పోలీసుల అసమర్థత, నేర నిర్ధారణ పట్ల పౌరుల అనాసక్తి దీనికి ప్రధాన కారణాలు. మన కళ్ల ముందే క్రూరంగా తయారవుతున్న సామాజిక సంస్కృతికి దుండగుల "ఎన్కౌంటర్"లు పరిష్కారం అనుకోవడం వివిధ స్థాయిలలోని సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుంది" అని వరంగల్లో ముగ్గురు యువకులను పోలీసులు ‘ఎన్కౌంటర్’ చేసినప్పుడు హక్కుల నేత కె.బాలగోపాల్ అభిప్రాయపడ్డారు.
"ఇది ఇంతటితో ఆగదు, మున్ముందు ఇదొక ట్రెండ్గా మారే ప్రమాదం ఉంది'' అంటూ.. 'అన్యాయ' న్యాయానికి ఆమోదమా? అనే శీర్షికతో ఆంధ్రజ్యోతికి రాసిన వ్యాసంలో వరంగల్ ఘటన జరిగనప్పుడు ఆయన హెచ్చరించారు.
ఇప్పుడు మన మధ్య లేని కె. బాలగోపాల్ 2008లో చేసిన ఆ వ్యాఖ్యలను, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘటనపై స్పందించే సందర్భంలో పలువురు పౌరహక్కుల నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పేర్లు పెట్టడం కాదు, శిక్ష పడటం ముఖ్యం
"ఓ తల్లిగా, కూతురుగా, భార్యగా నేను దీన్ని స్వాగతిస్తున్నా. లేదంటే వాళ్లు ఏళ్ల తరబడి జైల్లో ఉండేవారు. నిర్భయ అసలు పేరు కూడా అది కాదు, ప్రజలే ఆ పేరు పెట్టారు. అయితే ఈ పేర్లు పెట్టడం కన్నా కూడా వారికి శిక్ష పడటమే ముఖ్యం" అని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"ఉత్తర్ ప్రదేశ్లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిద్రాణంగా ఉంది. ఇక్కడి పోలీసులు, దిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి ప్రేరణ పొందాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడి నేరస్తులను అతిథుల్లాగా చూస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తోంది" అని మాయావతి విమర్శించారు.
మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదు: రెబెకా మమెన్ జాన్
ఈ ‘ఎన్కౌంటర్’ ఘటనపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, క్రిమినల్ లాయర్ రెబెకా మమెన్ జాన్ స్పందించారు. మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘వాళ్లే నేరం చేశారు అనడానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా? ఏ కోర్టు అయినా వాటిని పరిశీలించిందా? ఏ కోర్టు అయినా నేరాన్ని నిర్థరించిందా? ఒకవేళ వాళ్లే నేరం చేశారు అనుకుంటే, అది నిర్థరించడానికి ఓ పద్ధతి ఉంది. దాన్ని తప్పితే, తర్వాత మీ వంతే కావచ్చు’’ అని అన్నారు.
‘‘అత్యాచార బాధితులకు సహాయం చేయడం చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ. దాన్ని మీరెప్పుడూ పాటించలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఏం ఎదుర్కొన్నారో మీకు అవగాహన లేదు. సిగ్గుతో మీ తలలు దించుకోండి, భయంతో కూడా. ఇది మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"మహిళలపై హింసకు సంబంధించిన కేసులను నేరుగా సుప్రీంకోర్టే విచారించే విధంగా చట్టాన్ని రూపొందించాలి. ప్రస్తుతం కింది కోర్టుల్లో మొదలయ్యే న్యాయ ప్రక్రియ, అలా కొనసాగుతూనే ఉంది" అని శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ పార్లమెంటుకు సూచించారు.
న్యాయ వ్యవస్థ ద్వారా నిందితులకు శిక్ష పడుతుంది అనే విశ్వాసం పౌరుల్లో ఉండాలి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇలాంటి ‘ఎన్కౌంటర్’లను చట్టబద్ధం చేయాలని బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.
మరోవైపు, కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయ్ ఈ ‘ఎన్కౌంటర్’ను వ్యతిరేకించారు.
"ఇది తప్పు, దీన్ని సమర్థించకూడదు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీనికి మద్దతివ్వకూడదు. విచారణ జరగాలి. కేవలం కొద్దిమంది ఈ ఎన్కౌంటర్ను సమర్థించినంత మాత్రాన ఇది సరైన చర్య అయిపోదు. కొంతమంది మూకదాడులను కూడా సమర్థిస్తున్నారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"హైదరాబాద్లో ఏం జరిగిందో నాకింకా వాస్తవాలు పూర్తిగా తెలియదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, నేను చెప్పగలిగేది ఒక్కటే, దీనిపై లోతైన విచారణ జరగాలి. ఇది నిజమైన ఎన్కౌంటరేనా లేక వాళ్లు నిజంగానే తప్పించుకోవాలని చూశారా, ఇంకేమైనా జరిగిందా అనే దానిపై విచారణ జరగాలి" అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, UGC
ఆ పోలీసులపై హత్యానేరం మోపాలి - మానవ హక్కుల వేదిక
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు చనిపోవడానికి కారణమైన పోలీసులు అందరిపైనా హత్యానేరం మోపాలని, తక్షణం వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది.
ఈ మేరకు మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి మాధవరావు, ఆంధ్ర, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కేసును తెలంగాణ పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉంచలేమని, కాబట్టి సీబీఐకి అప్పగించాలని వారు కోరారు. న్యాయస్థానాలు సైతం ఈ హత్యలపై తక్షణం స్పందించాలని కోరారు.
వెటర్నరీ డాక్టర్ మరణం తర్వాత సమాజంలో చాలామంది ప్రజలు నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్లు చేయటంతో.. ప్రజల మనోభావాలను పోలీసులు అదనుగా తీసుకుని, కావాలనే తమ ఆధీనంలోని నలుగురినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రాల్లో 2007 తర్వాత నిర్బంధంలో ఉన్న నేరారోపితులను హత్య చేయడం ఇది మూడోసారని పేర్కొన్నారు. 2007లో విశాఖపట్నం శివార్లలో బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మేనేజర్ హత్య కేసు నిందితులను, 2008లో వరంగల్ యాసిడ్ దాడి కేసులో నిందితులను కూడా పోలీసులు ఇలాగే చంపేశారని తెలిపారు. తమను తాము కాపాడుకునే ప్రయత్నంలోనే నిందితుల్ని చంపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ భౌతికంగా తమ ఆధీనంలో ఉన్న నిందితులను పోలీసులే ఊచకోత కోస్తున్నారని వారు ఆరోపించారు.
చట్టం ప్రకారం జరగాల్సిన అన్ని ప్రక్రియలనూ వదిలేసి, ఇలాంటి హత్యలకు పాల్పడితే ఎంతోకొంత న్యాయం జరిగిందనుకోవడం అవాస్తవమని, న్యాయమూర్తిగా, న్యాయవాదిగా, శిక్షకుడిగా.. అన్ని పాత్రలూ పోలీసులే పోషించి, ప్రాణాంతకమైన న్యాయం చేయడాన్ని అనుమతించవచ్చా? అని వారు ప్రశ్నించారు.
సోషల్ మీడియా ఏమంటోంది?
అయితే, పోలీసులు ఇలా చేసి ఉండకూడదని, కోర్టు ద్వారా వారి నేరాలు నిరూపణ జరిగి, శిక్ష పడి ఉండాల్సిందని కూడా కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

"తెల్లవారుజామున 3.30 గంటలకు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే నమ్మలేకపోతున్నాం. మొత్తానికి జరిగిన దారుణ నేరానికి నిందితుల ఎన్కౌంటర్తో ముగింపు పలికారు" అని జీవన్లాల్ వెలగ అనే యూజర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

"సజ్జనార్ గారికి, ఆయన బృందానికి ధన్యవాదాలు. నిర్భయ కేసులో నిందితుల విషయంలో కూడా ఇలాగే జరగాలి. 9 నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టినవారి విషయంలో కూడా ఇదే జరగాలి. వాళ్లను కూడా ఇదే విధంగా చేయండి" అని జ్యోతిర్మయి కలువకొలను అభిప్రాయపడ్డారు.

"ఆబిడ్స్, అమీర్ పేట్, కుకట్పల్లి, దిల్సుఖ్నగర్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎన్కౌంటర్ చేసి ఉంటే కొంతకాలమైనా ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు. కోర్టులకు చాలా డబ్బును ఆదా చేశారు" అని జొన్న చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

అయితే, జొన్న చంద్రశేఖర్ వ్యాఖ్యపై రాఘవేంద్ర సునీల్ భిన్నంగా స్పందించారు. "బహిరంగంగా ఎలా ఎన్కౌంటర్ చేస్తారు? అక్కడ వాళ్లు పారిపోతున్నట్లు సీన్ క్రియేట్ చెయ్యాలి. అందుకే ఆ స్పాట్కే తీసుకెళ్లారు" అని పోస్ట్ చేశారు.

"తెలంగాణ పోలీసులు నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు, ధన ప్రలోభాలకు లొంగకుండా అన్ని కేసులకూ పోలీసులు ఇదే విధానాన్ని అవలంభించాలి. గుడ్ జాబ్" అని రవిసుజికీ సుజికీ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

"వాళ్లు (నిందితులు) చేసింది 100శాతం తప్పే. వాళ్లు చేసినదానికి సరైన శిక్ష పడింది. కానీ ఒక ధనవంతుడో, పలుకుబడి ఉన్న వ్యక్తో ఇలా చేస్తే అప్పుడు కూడా ఇదే విధంగా ఎన్కౌంటర్ చేసే ధైర్యం ఉందా వీళ్లకి? చట్టం పేద ప్రజలను, ధనవంతులను ఒకేలా ట్రీట్ చెయ్యగలదా?" అని ప్రశ్నించారు మధు గౌడ్.
ఇవి కూడా చదవండి.
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్: 'సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- 'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'
- దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్గా గుర్తించండి’
- వరంగల్: బర్త్ డే పార్టీ అని పిలిచి అత్యాచారం... బాధితురాలి మృతి
- గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’
- అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు?
- పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు
- అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








