అమెరికా: జింకని చంపుదామనుకున్న వేటగాడిని అదే చంపేసింది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఓ వేటగాడు జింక దాడిలో మృతిచెందాడు. అంతకు కొద్ది సేపటి ముందు ఆ వేటగాడు అదే జింకని చంపడానికి ప్రయత్నించాడు.
66 ఏళ్ల థామస్ అలెగ్జాండర్ ఓజార్క్ పర్వతాల సమీపంలో వేటకు వెళ్లాడు.
తన ఎదురుగా కనిపించిన జింకని తుపాకితో కాల్చాడు. అది పూర్తిగా నేలపై పడిపోవడాన్ని కళ్లారా చూశాడు.
దీంతో అది చనిపోయిందని భావించిన థామస్.. దాని కళేబరాన్ని లాక్కుని రావడానికి దగ్గరకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పైకి లేచిన జింక, అతడిపై దాడిచేసింది.
ఎలాగో అతి కష్టం మీద సమీపంలోనే ఉన్న తన భార్యను పిలిచాడు థామస్. ఆమె అంబులెన్స్కు సమాచారం అందించడంతో వారు వచ్చి థామస్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే ప్రాణాలు వదిలాడు.
"థామస్ అలెగ్జాండర్ మరణం చాలా వింతగా ఉంది. నా 20 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఇలాంటి దాడిని ఇంతకుముందెన్నడూ చూడలేదు" అని అర్కాన్సాస్ గేమ్ అండ్ ఫిష్ కమిషన్కు చెందిన కీత్ స్టీఫెన్స్ స్థానిక మీడియాతో అన్నారు.
"అది నేలపై ఎంతసేపు పడి ఉందో నాకు తెలియదు. జింక చనిపోయిందని నిర్థారించుకోవడానికే థామస్ దాని దగ్గరకు వెళ్లాడు. కానీ అది చనిపోలేదు. తిరిగి దాడి చేసింది" అని స్పీఫెన్స్ తెలిపారు.
"ఎయిర్ అంబులెన్స్లో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. కానీ అతడిని హెలీకాప్టర్లోకి ఎక్కించేలోపే మరణించాడు. దీంతో ఎయిర్ అంబులెన్స్ ఉపయోగించలేదు" అని స్టీఫెన్స్ బీబీసీతో చెప్పారు.
"థామస్ మరణానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టమ్ తరవాతే స్పష్టంగా తేలుతుంది, కానీ అతడి శరీరంపై చాలా భాగాల్లో తీవ్ర గాయాలున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి" అని ఆయన అన్నారు.
గాయపడిన జింక కోసం కూడా కమిషన్ బృందం వెతుకుతోంది.
ఈ వీడియో చూశారా!
ఇవి కూడా చదవండి.
- హిందూత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- 'ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీ లక్ష్యంగా అమెరికా సీక్రెట్ ఆపరేషన్' - యూఎస్ మీడియా
- దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా
- 346 మంది ప్రాణాలు తీసిన ఆ విమానం కూలడానికి వరుస వైఫల్యాలే కారణం
- గిన్నిస్ బుక్లోకి ఎక్కిన అయోధ్య దీపోత్సవం
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- బీసీసీఐ ప్రెసిడెంట్: నాడు విజయనగరం రాజ కుమారుడు.. నేడు కోల్కతా ‘ప్రిన్స్’.. 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు కెప్టెన్కు పగ్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేయండి.)









