మహారాష్ట్ర: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా

అజిత్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని ఏఎన్ఐ వర్గాల సమాచారంతో ఏఎన్ఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రేపు ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌లతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

బలనిరూపణకు గవర్నర్ వారికి 7 రోజుల గడువిచ్చారు.

ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, Getty Images

దీనిపై ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వెంటనే బలనిరూపణకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి.

మహారాష్ట్ర రాజకీయ ఘటనాక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చెబుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించాయి. దీనిపై ఆదివారం ప్రారంభమైన విచారణ సోమవారం కూడా కొనసాగింది. అన్ని పార్టీల వాదనలు విన్న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం తన ఆదేశాలను జారీచేసింది.

మరికాసేపట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్

ఫొటో సోర్స్, ANI

అసలేం జరిగింది?

మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తరువాత సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.

ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు రెండింటికీ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈలోగా అసెంబ్లీ గడువు పూర్తవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది.

దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రయత్నాలు చేసింది.

ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకముందే శనివారం ఉదయం ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆగమేఘాల మీద బీజేపీ, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాయి.

శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)