మహారాష్ట్ర: దేవేంద్ర ఫడణవీస్ బలపరీక్ష రేపే... సుప్రీం కోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్ రేపు(నవంబరు 27) సాయంత్రం 5 గంటలలోగా బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తీర్పులో ముఖ్యాంశాలు
* నవంబరు 27 సాయంత్రం 5 గంటల్లోగా ఓపెన్ సీక్రెట్ బ్యాలట్ విధానంలో బల పరీక్ష జరపాలి.
* ఆలోగా ప్రోటెం స్పీకరును నియమించాలి.
* బలపరీక్ష కోసం శాసనసభను సమావేశపరచాలి.. సమావేశ అజెండా బలపరీక్ష ఒక్కటే కావాలి.
* మొత్తం ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
గత నాలుగు రోజుల్లో
బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్నాక ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
తొలుత న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు విన్నది.
కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్లకు కోర్టు శనివారమే నోటీసులు జారీ చేసింది. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖ ప్రతులను, ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన పత్రాలను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమకు అందించాలని సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.
సోమవారం వాటిని పరిశీలించి వాదనలు విన్నాక మంగళవారం ఉదయం 10.30కి తీర్పు వెలువరిస్తామని కోర్టు చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఏర్పాటుపై..
మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తరువాత ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ రాలేదు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు రెండింటికీ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈలోగా అసెంబ్లీ గడువు పూర్తవడంతో రాష్ట్రపతి పాలన ఏర్పడింది.
దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రయత్నాలు చేసింది.
ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకముందే శనివారం ఉదయం ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆగమేఘాలమీద బీజేపీ, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాయి.
శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఇవి కూడా చదవండి
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- ప్రపంచంలో మొబైల్ డాటా ధరలు ఎక్కువగా ఉంది ఈ దేశంలోనే.. డాటా కోసం తిండి మానేస్తున్నారు
- #BottleCapChallenge: ఈ వైరల్ బాటిల్ క్యాప్ చాలెంజ్ ఏంటి? ఎందుకు?
- రష్యా అమ్మాయిలు తమ శరీరం మీద ముడతలు, చారలు, మచ్చలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు?
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- ఇన్స్టాగ్రామ్లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
- అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా
- అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది
- బ్రౌన్ గర్ల్స్... ఇన్స్టాగ్రామ్లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- ఆధార్తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








