అరవింద్ కేజ్రీవాల్: దిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో డీటీసీ (దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్), క్లస్టర్ బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈమేరకు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రకటన చేశారు.
‘‘ప్రభుత్వ రవాణా వ్యవస్థ (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్) మహిళలకు చాలా సురక్షితం అని అంటుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. డీటీసీ, క్లస్టర్ బస్సులు.. అన్ని బస్సుల్లోనూ, మెట్రో రైళ్లలోనూ మహిళల ప్రయాణాన్ని ఉచితం చేస్తుంది. దీంతో మహిళలు ఎక్కువగా ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగిస్తారు’’ అని ప్రకటించారు.
రాబోయే రెండు, మూడు నెలల్లో ఈ ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. టిక్కెట్ కొని ప్రయాణించాలనుకునే మహిళలు.. టిక్కెట్ కొనుగోలు చేసి కూడా ప్రయాణించొచ్చునని, తద్వారా ఆ సబ్సిడీ అర్హులైన ఇతర మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
కాగా, బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల పడే భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.

ఈ ఏడాది ఈ ఉచిత ప్రయాణం కోసం రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకూ కేటాయించాల్సి వస్తుందని దిల్లీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని దిల్లీ మెట్రోకు తెలియజేశామని, మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
దిల్లీ ప్రభుత్వ బస్సుల్లో దాదాపు 40 లక్షల మంది ప్రయాణిస్తారని, వారిలో 30 శాతం మహిళలు ఉంటారని అంచనా.
ఇవి కూడా చదవండి:
- చైనాలో 'బస్ పూలింగ్'.. ప్రయాణికుల చెంతకు బస్సు
- సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్పై నిషేధం ఎత్తివేత
- మన టీ-షర్టులు మనకన్నా ఎక్కువ దేశాలు తిరిగాయా?
- నల్లమల అడవుల్లో కట్టెలబండి.. పేదలకు బతుకు బండి
- సైన్స్లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు
- మొట్టమొదటి మెట్రో ఎప్పుడు మొదలైందో తెలుసా!
- మెట్రో రైలులో నిండు గర్భిణి మీద సెక్యూరిటీ గార్డుల దాడి
- మెట్రో రైళ్లలో వందలాది మంది ప్యాంట్లు విప్పేశారు.. ఎందుకంటే..
- ‘హైదరాబాద్ మెట్రో‘ లిఫ్ట్లో దృశ్యాలు వైరల్: ముద్దూ ముచ్చట అసాంఘికమా
- క్వీన్ నీలగిరి: ఆకుపచ్చని ప్రపంచంలో అందాల రాణి
- రియాలిటీ చెక్: అరవింద్ కేజ్రీవాల్ పోర్న్ వీడియో చూశారా, అసలు నిజమేంటి?
- దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధ్యం కాదు: సుప్రీంకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








