వాట్సాప్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్నాబెల్లే లియాంగ్
- హోదా, బిజినెస్ ప్రతినిధి
మెసేజ్లను ఎడిట్ చేసుకునేలా యూజర్లకు అనుమతివ్వనున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.
‘‘ఎడిటింగ్ ఫీచర్ వల్ల చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవడం నుంచి మెసేజ్కు అదనపు వివరాలను యాడ్ చేసుకునేంత వరకు, మీ చాట్లపై మీకు మరింత నియంత్రణ ఉంటుంది’’ అని ఈ మెసేజింగ్ సర్వీస్ సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది.
మెసేజ్లు పంపిన 15 నిమిషాల వరకు వాటిని ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది.
ఎడిట్ చేయాలంటే పంపిన మెసేజ్ను లాంగ్ ప్రెస్ చేయాలి. తర్వాత మెనూలోకి వెళ్లి ‘ఎడిట్’ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి.
ఎడిట్ చేసిన మెసేజ్లకు ‘‘ఎడిటెడ్’’ అనే ట్యాగ్ వస్తుంది. దీని ద్వారా కంటెంట్ను మార్చినట్లు మెసేజ్ స్వీకరించిన వారికి తెలుస్తుంది. అయితే, ఈ సమయంలో మెసేజ్లో ఏం మార్చారో అవతలి వారికి కనిపించదు.

ఫొటో సోర్స్, Reuters
మెసేజింగ్ సర్వీసులు టెలిగ్రాం, సిగ్నల్ ఈ ఫీచర్ను ఆఫర్ చేయడం ప్రారంభించిన తర్వాత వాట్సాప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
రాబోయే వారాల్లో 200 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
48.7 కోట్ల మంది యూజర్లతో భారత్ వాట్సాప్కు అతిపెద్ద మార్కెట్గా ఉంది.
అమెరికా టెక్నాలజీ దిగ్గజం మెటా కింద వాట్సాప్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులను అందిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థల యజమాని కూడా మెటానే.

ఫొటో సోర్స్, WHATSAPP
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ఈ ఎడిట్ ఫీచర్ను సుమారు దశాబ్దం క్రితమే ప్రవేశపెట్టింది.
తమ యూజర్లలో సగం మందికి పైగా మొబైల్ ఫోన్పై తమ సైట్ను యాక్సెస్ చేస్తున్నారని ఆ సమయంలో టైపింగ్ తప్పులు వస్తున్నాయని అప్పట్లో ఫేస్బుక్ తెలిపింది.
ఫేస్బుక్పై అప్డేట్ చేసిన వాటిని ఎడిటెడ్గా చూపిస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ కూడా 2022లో ఈ ఫీచర్ను ప్రకటించింది. డబ్బులు చెల్లించే సబ్స్క్రైబర్లకు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని ట్విటర్ తెలిపింది. వారు పోస్ట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లోపు ట్వీట్లను ఎడిట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో రహస్యంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.. ఇది ఏ స్థాయిలో ఉంది?
- రూ. 2,000 నోటు మార్పిడి నేటి నుంచే.. మీ దగ్గరున్న నోట్లను ఇలా మార్చుకోవాలి
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- బ్రిటన్ ప్యాలెస్లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















