అమెరికా: దొంగల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో తానే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు

ఫొటో సోర్స్, EPA
ఇంట్లోకి ఎవరూ చొరబడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఉచ్చులో చిక్కుకుని అమెరికాలో రొనాల్డ్ సిర్ (65) అనే వ్యక్తి మరణించారు.
మెన్ రాష్ట్రంలోని వాన్ బరెన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
తనకు తూటా తగిలినట్లు రొనాల్డ్ 911కు ఫోన్ చేయడంతో, ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆయన ఏర్పాటు చేసుకున్న ఉచ్చును గుర్తించారు.
ఇంట్లోకి ఎవరైనా చొరబడేందుకు ప్రయత్నిస్తే హ్యాండ్ గన్ పేలి వారికి తూటా తగిలేలా ఇంటి తలుపులను రొనాల్డ్ తీర్చిదిద్దినట్లు పోలీసులు వెల్లడించారు.
అమెరికాలో ఇళ్ల యజమానులు ఇలాంటి ఉచ్చులు ఏర్పాటు చేసుకోవడం అసాధారణమేమీ కాదు. కానీ, ఇద్ది చట్ట వ్యతిరేకమైన చర్య.
‘‘తనకు తూటా తగిలిందని రొనాల్డ్ మాకు ఫోన్ చేసి చెప్పారు. మేం వెళ్లి విస్తృత స్థాయిలో విచారణ జరిపాం. రొనాల్డ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పరికరం కారణంగానే గన్ పేలినట్లు గుర్తించాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు’’ అని స్థానిక పోలీసు విభాగం ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది.
అయితే, ఆ గన్ అనుకోకుండా ఎలా పేలిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఫొటో సోర్స్, Reuters
ఇంట్లో మరిన్ని అనుమానాస్పద పరికరాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో వాటిని వారు పరిశీలిస్తున్నారు.
గతంలోనూ ఇలా ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఉచ్చుల కారణంగా వ్యక్తులు చనిపోయిన ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నాయి.
అమెరికాలో ఇలాంటి ఉచ్చులు పూర్తిగా చట్ట విరుద్ధం. వీటిని ఏర్పాటు చేసుకునేవారిపై అధికారులు చర్యలూ తీసుకుంటున్నారు.
ఇలాంటి ఉచ్చుల బారిన పడ్డ చొరబాటుదారులకు.. ఇళ్ల యజమానులే పరిహారం చెల్లించేలా గతంలో కోర్టులు తీర్పునిచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తమ ఇంటిని కాపాడుకునే హక్కు వ్యక్తులకు ఉన్నప్పటికీ, చొరబాటుదారుడికి శిక్షను నిర్ణయించే అధికారం యజమానికి లేదని కోర్టులు స్ఫష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి:
- జాన్సన్ అండ్ జాన్సన్కు మరో ఎదురుదెబ్బ... వజైనల్ మెష్ కేసులో ఓటమి
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’
- ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- కేసీఆర్: ‘‘ఒక్క కార్మికుడినీ తీసేయం... ఒక్క ప్రైవేటు బస్సుకూ అనుమతి ఇవ్వం.. బడ్జెట్లో ఏటా రూ. వెయ్యి కోట్లు ఇస్తాం’’
- కేటీఆర్ ట్వీట్: ‘నరేంద్ర మోదీజీ, నిర్భయ హంతకుల్ని ఏడేళ్లైనా ఉరితీయలేదు..’
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- చైనా కొత్త విధానం: మొబైల్ ఫోన్ కొని, వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సిందే
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








