పాకిస్తాన్: ఇసుకలో ముగ్గురు పిల్లల మృతదేహాలు.. హత్యకు ముందు ఒకరిపై అత్యాచారం

పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కసూర్ జిల్లాలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ జిల్లాలో తాజాగా ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి.
వారిలో ఒకరిపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి పోస్ట్మార్టం నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
కసూర్లో గత కొన్నేళ్లలో చిన్నారుల అపహరణలు, అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగాయి.
2018లో జైనాబ్ అనే ఆరేళ్ల బాలిక అదృశ్యమైన ఘటనపై పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనాలు రోడ్ల మీదకు వచ్చారు. ఈ ఆందోళనల్లో చోటుచేసుకున్న హింసలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఈ పరిణామాల తర్వాత జైనాబ్పై అత్యాచారం చేసి, హత్య చేసిన 24 ఏళ్ల ఇమ్రాన్ అలీని పోలీసులు పట్టుకున్నారు. అతడు మరో ఆరుగురు బాలికలపైనా ఇలాంటి నేరాలకే ఒడిగట్టినట్లు తేలింది.
ఆ వ్యక్తికి అదే ఏడాది అక్టోబర్లో మరణశిక్ష అమలు చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
తాజాగా చున్నియన్ ప్రాంతంలో బుధవారం ప్రజలు ఆందోళనలు చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ను చట్టుముట్టి రాళ్లు రువ్వారు.
మంగళవారం ఓ పారిశ్రామిక ప్రాంతంలో ఇసుకలో ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ చిన్నారులందరి వయసు పదేళ్లలోపే ఉంటుందని పాక్ మీడియా పేర్కొంటోంది.
దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇప్పుడు లభ్యమైన మృతదేహాల్లో ఎనిమిదేళ్ల ఫైజాన్ కూడా ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఇనామ్ ఘని బీబీసీతో చెప్పారు.
సోమవారం అతడు కనిపించకుండా పోయాడని, అతడిపై అత్యాచారం జరిగినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరో ఇద్దరు బాలురు ఆగస్టులో అదృశ్యమైనవారు అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అదృశ్యమైన సమయంలో వారు ధరించిన దుస్తులతో ఈ మృతదేహాలతోపాటు దొరికిన గుడ్డ పీలికలు సరిపోలుతున్నట్లు వారు చెప్పారు.
''డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించాం. జూన్లో గల్లంతైన ఓ బాలుడి గురించి గాలింపు కొనసాగుతోంది. వాళ్ల వివరాలు, మృతికి కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు'' అని ఘని చెప్పారు.
మహమ్మద్ అఫ్జల్ అనే కార్మికుడి కుమారుడు అలీ హుస్సేన్ గత ఆగస్టులో అదృశ్యమయ్యాడు.
అప్పటి నుంచి తాము ఇంట్లో సరిగ్గా పొయ్యి వెలిగించింది కూడా లేదని అఫ్జల్ బీబీసీతో చెప్పారు.
గత ఆగస్టులో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సులేమాన్ అక్రమ్, తిరిగి ఇంటికి రాలేదని అతడి మామయ్య మహమ్మద్ అష్రఫ్ చెప్పారు. గాలింపు విషయంలో పోలీసులు సహకరించట్లేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Twitter
కొన్ని వారాలుగా కసూర్లోని ప్రజలు భయాందోళనతో ఉన్నారని, తమ చిన్నారులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని బీబీసీ ఉర్దూ తెలిపింది.
చిన్నారుల అపహరణల విషయాన్ని పాకిస్తాన్లోని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
జైనాబ్ హత్య తర్వాత పోలీసుల శిక్షణ, చట్టాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపడతామని పాకిస్తాన్ పేర్కొంది.
అయితే, హంతకుడు జైనాబ్ను తీసుకువెళ్తున్న వీడియో ఫుటేజీ ఆమె కుటుంబ సభ్యులు సంపాదించి, కోర్టుకు సమర్పించాకే అతడికి శిక్ష పడింది.
ఇవి కూడా చదవండి:
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్బుక్ ఈవెంట్
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- 'సౌదీ చమురు క్షేత్రాలపై ఇరానే దాడులు చేసిందనడానికి ఈ శకలాలే నిదర్శనం'
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- హైదరాబాద్కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- ఈ బంగారు టాయిలెట్ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








