Mumbai Fire: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఆరుగురి మృతి

ఫొటో సోర్స్, BBC Marathi
ముంబయిలోని 20 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో ఆరుగురు మరణించారు. ఈ మేరకు ముంబయి అగ్నిమాపక శాఖ అధికారులు ధ్రువీకరించారు.
తాడ్దేవ్ ప్రాంతంలో ఉన్న భాటియా ఆసుపత్రి సమీపంలోని 20 అంతస్తుల కమలా బిల్డింగ్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
మంటలనార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో అపార్ట్మెంట్లోని చాలామంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
ప్రస్తుతం అక్కడ 13 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శనివారం ఉదయం 7.30 ప్రాంతంలో భవనంలో మంటలు చెలరేగినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.
ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని భాటియా ఆసుపత్రి, నానక్రామ్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ప్రమాదానికి కారణమేంటి?
అపార్ట్మెంట్ 18వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. అయితే, మంటలకు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.
13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.
ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు ముంబయి అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన 18వ అంతస్తు పైనున్న అంతస్తులతో పాటు మరికొన్ని ఫ్లోర్లలో నివసిస్తున్నవారినీ అధికారులు ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- ఏడు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ టోనీని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- దిల్లీ పీఠానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగానే ఎందుకు వెళ్తుంది?
- ‘మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












