రోహిత్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బ్రేక్

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు.
టీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడుగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ 86 టీ20ల్లో మొత్తం 2203 పరుగులు చేశాడు.
ఇప్పటి వరకూ ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది.
ఈ రోజు మ్యాచ్ మొదలుకాక మందు రోహిత్ అత్యధిక పరుగుల రికార్డుకు కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్నాడు.
ఇప్పటి దాకా 2102 పరుగులతో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మన్గా ఉన్నాడు.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 60 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
మొత్తం ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. కోహ్లీ ఈ మ్యాచ్కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయడంతో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నపుడు ఆమెకు ఇద్దరు భర్తలు ఎందుకు ఉండకూడదు?
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








