కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?

ఫొటో సోర్స్, Getty Images
భారత్లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న లక్షల మంది వ్యక్తుల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖుల పాస్పోర్ట్లు, ఐడీ కార్డ్ నంబర్లు, పుట్టినరోజులు, ఫోన్ నంబర్లు తదితర సమాచారం టెలిగ్రామ్ యాప్లో అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
టెలిగ్రామ్ యాప్లో ఎవరిదైనా నంబర్ను ఎంటర్ చేయగానే, వారికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని చెబుతున్నారు.
అనేక మంది ప్రముఖుల సమాచారాన్ని తాము చూడగలుగుతున్నామని పేర్కొంటూ చాలా మంది వ్యక్తులు టెలిగ్రామ్ యాప్ స్క్రీన్షాట్లను ట్విటర్లో పంచుకుంటున్నారు.
అయితే ఈ వార్తలు నిరాధారమైనవని భారత ప్రభుత్వం చెప్పింది. కోవిన్ ప్లాట్ఫారమ్ పూర్తిగా సురక్షితమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. "ఈ వార్తలకు ఎలాంటి ఆధారమూ లేదు. ఇవి దురుద్దేశపూర్వకమైనవి’’ అని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే అనేక స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఇలా అన్నారు.
రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రియాన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ ఎంపీ సుష్మిత్ దేవ్, అభిషేక్ మను సింఘ్వీ, సంజయ్ రౌత్ వంటి నాయకుల వివరాలు ఉచితంగా లభిస్తున్నాయి అని సాకేత్ గోఖలే చెప్పారు.
వీరే కాకుండా, రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖాదత్, ధన్య రాజేంద్రన్, రాహుల్ శివశంకర్ వంటి జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారం కూడా అందుబాటులో ఉందని ఆయన ఆరోపించారు.
‘‘ఈ డేటా లీకేజ్ గురించి హోంశాఖతో పాటు నరేంద్ర మోదీ సర్కారుకు సమాచారం లేదా’’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
" ఆధార్, పాస్పోర్ట్ వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని మోదీ ప్రభుత్వమే ఎవరికో లీక్ చేసింది. దాని ఫలితంగానే ఈ డేటా లీక్ జరిగింది. ఇది ఒక జాతీయ సమస్య’’ అని సాకేత్ గోఖలే తన ట్వీట్లో విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రశ్నిస్తున్న విపక్షాలు
డేటా లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి కోరారు.
వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇది ఉల్లంఘించడమేనని ఏచూరి అన్నారు.
ఈ అంశంపై సీపీఎం ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఆరోగ్య శాఖ 2021 జూన్లో ఇలాంటి ఆరోపణలనే ఖండించింది. అయితే, కోవిన్ సిస్టమ్ డేటా లీక్పై దర్యాప్తు చేయాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు’’ అని ప్రకటనలో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కోవిడ్ డేటా లీక్ వార్తలపై స్పష్టత ఇవ్వాలంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘ఒకవేళ ఈ వార్తలన్నీ నిజమైతే, ప్రభుత్వం తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలి. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు.
‘‘భారత పౌరులుగా, మేం మా డేటాను వివిధ ప్రభుత్వ పోర్టల్లలో నమోదు చేస్తాం. మా డేటా భద్రత కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రైవసీ గురించి ఎలాంటి సందేహాలూ తలెత్తకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
మా గోప్యతను రక్షించే బలమైన డేటా రక్షణ చట్టాలను చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తగు చర్యలు, పారదర్శకత, డేటా భద్రతకు సంబంధించి హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని సుప్రియ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
డేటా లీక్ కాలేదన్న ప్రభుత్వం
కో-విన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
"ఆరోగ్య శాఖకు చెందిన కో-విన్ పోర్టల్ పూర్తిగా సురక్షితం. అందులోని డేటా గోప్యతకు తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాం. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్, యాంటీ డీడీవోఎస్, ఎస్ఎస్ఎల్/టీఎల్ఎస్లతో పాటు తరచుగా పరిశీలన చేస్తున్నాం. ఓటీపీ ఆధారిత యాక్సెస్ మాత్రమే ఉంటుంది. కో-విన్ పోర్టల్లో డేటా భద్రతను నిర్ధరించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ఆరోగ్యశాఖ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
గతంలోనూ కోవిన్ డేటా భద్రతపై సందేహాలు
2021లో కూడా కో-విన్ పోర్టల్లోని కోట్ల మంది వ్యక్తుల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల డేటా లీక్ అయినట్లు 2022లో కూడా వార్తలు వచ్చాయి. వార్తాసంస్థ పీటీఐ ప్రకారం, రెడ్ ఫోరమ్ వెబ్సైట్లో ఒక సైబర్ నేరస్థుడు తన వద్ద 20 వేల మందికి పైగా వ్యక్తుల డేటా ఉందన్నాడు.
2022 జనవరిలో, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ, "కో-విన్ అనేది అత్యాధునిక భద్రతా వ్యవస్థ. ఇది ఎన్నడూ భద్రతా ఉల్లంఘనను ఎదుర్కోలేదు. యాప్లోని మా పౌరుల డేటా కచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. కోవిన్ డేటా లీక్కు సంబంధించిన ఏ వార్తలోనూ నిజం లేదు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














