బంగారు రామాయణం: వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన ఈ రామాయణాన్ని పసిడితో రాశారు
గుజరాత్లోని సూరత్లో ఉన్న ఈ రామాయణంలో ప్రతి పేజీలోని పంక్తులను బంగారు ఇంకుతో రాశారు. దీన్ని రాయడానికి ఇంకు కోసం 200 తులాల బంగారాన్ని, 20 తులాల బంగారాన్ని ముఖచిత్రంపై శ్రీరాముడి కోసం ఉపయోగించారు.
రాముడికి పైభాగంలో ఉన్న శివుడు, వినాయకుడు, హనుమాన్ బొమ్మలకు 2 తులాల బంగారం వాడారు. పైన తులసీకృత్ రామాయణ్ అని కెంపులు పొదిగారు.
ముఖచిత్రంపై రాముడి పక్కన స్తంభాలు, మండపానికి వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగారు.
రాముడి కిరీటంలో నీలం ఉంది. ముఖచిత్రం కవర్ వెండితో చేసింది. అంటే ఈ పుస్తకం ముఖచిత్రాన్ని బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలతో రూపొందించారు.
సూరత్లో ఉంటున్న రాజేష్ కుమార్ భక్త్, ఇందిరా బేన్ భక్త్ దంపతులు ప్రస్తుతం ఈ స్వర్ణ రామాయణాన్ని సంరక్షిస్తున్నారు.
1981లో ఈ స్వర్ణ రామాయణాన్ని రూపొందించారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్లాండ్లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









