దిల్లీలో యమున నది వరద ఉద్ధృతి.. 9 ఫోటోలలో

వరద నీటిలో మునిగిన ఇళ్లు

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధాని దిల్లీలో యమునా నది ఉద్ధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సెప్టెంబర్ 6 ఉదయం 8 గంటల సరి యమున నది నీటి మట్టం దిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద 206.67 మీటర్లు ఉందని అధికారులు వెల్లడించారు.

ఇది ప్రమాద స్థాయిని దాటింది కానీ గరిష్ఠ వరద స్థాయి కంటే తక్కువేనని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.

రైల్వే బ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అంతకుముందు వరద స్థాయిని ప్రామాణికంగా తీసుకునే ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఈ సీజన్ గరిష్ఠ స్థాయి 207.48 మీటర్లకు యమున వరద ప్రవాహం చేరింది.

తరువాత క్రమంగా 207.12 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం 206.4 మీటర్లతో వరద తగ్గుముఖం పడుతోంది.

Flood affected people at Mayur Vihar Phase One Relief Camp as the water level of the River Yamuna rises , on September 4, 2025 in New Delhi

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయూర్ విహార్ ఫేజ్ -1 ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు

యమున నదిలో వరద ప్రవాహం పెరిగే సమయాల్లో అధికారులు ముందస్తుగా తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. యమున నదీ సమీపంలో రోడ్ల వెంబడి ఇలాంటివి పెద్ద సంఖ్యలో చూడొచ్చు.

వరద టెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు కూడా కొన్ని చోట్ల నీట మునిగాయి.

ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్లలోకి కూడా వరద నీరు చేరడంతో గుడారాలను ఖాళీ చేశారు.

మయూర్ విహార్ ప్రాంతంలో సహాయ శిబిరాలలోకి నీరు చేరింది. దీంతో ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు.

సామాన్లు తీసుకువెళుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

భారీవర్షాలకు తోడు హత్నికుండ్, వజీరాబాద్ బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటం యమునానది నీటిమట్టం పెరగడానికి కారణమవుతోంది.

ప్రజలు తమ సామాన్లతో వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

దిల్లీ ఓల్డ్ బ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యమున ఓల్డ్ బ్రిడ్జి

గురువారం(4.09.205)న వరద గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ సమయంలో దిల్లీ ఓల్డ్ బ్రిడ్జిని తాకుతూ యమున నది ప్రవహించింది.

తాత్కాలిక శిబిరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు

నోయిడా అథార్టీ వరద బాధితుల కోసం రిలీఫ్ క్యాంప్ ఏర్పాటుచేసి ఆహారాన్ని అందించింది.

యమున వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయూర్ విహార్ సమీపంలో యమున నది ఒడ్డున ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల వద్ద ఆహారం కోసం లైన్లలో నిల్చున్న వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు

యమునా నది వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 38 ప్రాంతాలలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

నిరాశ్రయులైనవారి కోసం 522 టెంట్లు ఏర్పాటు చేశారు.

యమున వరదల కారణంగా బ్రిడ్జిపై చేరిన పశువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరద నీరు పోటెత్తడంతో తాత్కాలికంగా మూసేసిన ఓ వంతెనపై పశువులు చేరాయి.

ఇప్పటి వరకు 8,018 మందిని ఈ శిబిరాలకు తరలించారని అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

మరోవైపు శాశ్వత శిబిరాలలో 2,030మంది ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)