ఫొని అని పేరు పెట్టిన బంగ్లాదేశ్పైనే ప్రతాపం చూపిస్తున్న తుపాను

ఫొటో సోర్స్, Getty Images
ఫొని తుపాను భారతదేశం నుంచి బంగ్లాదేశ్ మీదకు మళ్ళింది. అక్కడ అది తన ప్రతాపం చూపింది.
తుపాను ధాటికి వెయ్యికి పైగా ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఐదుగురు మరణించగా, 63 మంది గాయపడ్డారు.
ముందస్తు చర్యగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘‘భారీ విపత్తు వచ్చే భయాందోళన అయితే ఇప్పుడు లేదు’’ అని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి, వాయుగుండం శనివారం భారత్ నుంచి బంగ్లాదేశ్ దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది. కానీ, తుపాను ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
నొహ్లీ జిల్లాలో చాలా ఇళ్లు నీటమునిగాయి. ఇక్కడ ఇద్దరు పిల్లలు చనిపోగా, 20 మంది గాయపడ్డారు.
ఫొని తుపాను ధాటికి భారత్లోనూ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
శుక్రవారం నాటికి ఫొని తుపాను మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు, ఆస్తి నష్టం భారీగా ఉందని అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, EPA
బంగాళఖాతం కేంద్రంగా 1999లో వచ్చిన భారీ తుఫాను కారణంగా ఒడిశాలో 10 వేల మంది చనిపోయారు. అప్పటి నుంచి తుపాను హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరిచారు.
ఇవి కూడా చదవండి
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది
- థాయ్ కింగ్ పెళ్ళి: బాడీగార్డుతో ప్రేమ వివాహం
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- ‘భూములిచ్చినవారికి ఉద్యోగాలన్నారు, ఆ మాట ఏమైంది’
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి? తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









