బంగారం: ఆర్టీసీ బస్సులో దొరికిన అర కిలో పసిడి, నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తి

ఫొటో సోర్స్, ugc
ఆర్టీసీ బస్సులో దొరికిన రూ.27 లక్షల విలువ చేసే బంగారాన్ని ఓ వ్యక్తి నిజాయితీగా పోలీసులకు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి 454 గ్రాముల బంగారాన్ని దుర్గారావు అనే వ్యాపారి విశాఖపట్నానికి తీసుకొస్తుండగా బస్సులోనే మరచిపోయారు.
విశాఖకు సమీపంలోని మారికవలసలో సంచిని మరచిపోయి దుర్గారావు బస్సు దిగిపోయారు.

ఫొటో సోర్స్, UGC
ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే, అప్పటికే బంగారం దొరికిందంటూ పోలరాజు అనే వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నిజాయితీతో రూ.27 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి ఇచ్చినందుకు పోలరాజును పోలీసులు అభినందించారు.
దుర్గారావు.. శ్రీకాకుళంలోని బంగారం వర్తకుల నుంచి గోల్డ్ ముక్కలను తీసుకుని వాటిని ఆభరణాలుగా తయారు చేసి ఇస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








