విమానంలో పెళ్లి చేసుకున్న మదురై జంట.. విచారణకు డీజీసీఏ ఆదేశాలు

ఫొటో సోర్స్, ANI
తమిళనాడులో ఓ జంట విమానంలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
మరోవైపు ఈ పెళ్లి విషయంలో విమానయాన సంస్థ స్పైస్జెట్ వివాదంలో చిక్కుకుంది.
ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. వివాహ సమయంలో విమానంలో పనిచేసిన సిబ్బందిని స్పైస్జెట్ విధుల నుంచి తప్పించింది.

ఫొటో సోర్స్, Ani
అసలు ఏం జరిగింది?
మదురై నుంచి బయలుదేరిన విమానంలో ఒక జంట పెళ్లి చేసుకుంది.
ఈ విమానంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరుతోపాటు వారి బంధువులు కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మదురైకు చెందిన పెళ్లి కొడుకు మే 23న స్పైస్జెట్ చార్టర్ ఫ్లైట్ను బుక్ చేసుకున్నారు.
అయితే విమానంలో పెళ్లి జరిపించేందుకు దాన్ని బుక్ చేసుకున్నట్లు తమకు ముందుగా తెలియదని విమాన యాన సంస్థ వెల్లడించింది.
‘‘స్పైస్జెట్ విమానాన్ని వారు ముందుగా బుక్ చేసుకోవడం నిజమే. కానీ పెళ్లి కోసమే బుక్ చేసుకుంటున్నట్లు వారు చెప్పలేదు’’అని మదురై ఎయిర్పోర్టు డైరెక్టర్ సెంథిల్ వలవన్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విచారణకు ఆదేశించిన డీజీసీఏ
కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా, మాస్కులు సరిగా పెట్టుకోకపోయినా.. ఆ ప్రయాణికులను విమానాల్లో ఎక్కించుకోవద్దని డీజీసీఏ ఇటీవల ఆదేశాలు జారీచేసింది.
మదురై ఘటనపై విమానయాన సంస్థ నుంచి డీజీసీఏ నివేదిక కోరింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
మరోవైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు ప్రయాణికులపై విమానయాన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








