Ind Vs Eng రెండో టెస్ట్: 317 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ఫొటో సోర్స్, SAEED KHAN
చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్లో 482 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత స్పిన్నర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, కులదీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
ఇంగ్లండ్ జట్టులో చివరగా అవుటైన మొయిన్ అలీ చేసిన 43 పరుగులే అత్యధిక స్కోరు.
18 బంతుల్లో 43 పరుగులు చేసిన మొయిన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు.
అతడి తర్వాత కెప్టెన్ జో రూట్ 33 పరుగులు చేశాడు.
ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లు తీయడంతోపాటూ, రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 106 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
భారీ విజయ లక్ష్యం
భారత్ విజయం కోసం ఇంగ్లండ్కు 482 పరుగుల లక్ష్యం ఇచ్చింది.
భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ అద్భుత సెంచరీ వల్ల భారత్ 286 పరుగులు చేయగలిగింది.
స్పిన్నర్లకు అనుకూలించిన చెన్నై పిచ్పై ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని అందుకోలేక చతికిలబడింది.

ఫొటో సోర్స్, STU FORSTER
సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పరిస్థితి
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ వంద పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది.
లారెన్స్ 26, బర్న్స్ 25 పరుగులకు అవుట్ అయ్యారు. లీచ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, సిబ్లీ మూడు పరుగులే చేయగలిగాడు.
బెన్ స్టోక్స్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు.
116 పరుగుల దగ్గర బెన్ ఫోక్స్(2)ను మరో స్పిన్నర్ కులదీప్ యాదవ్ అవుట్ చేశాడు.
లంచ్ తర్వాత అదే స్కోరు దగ్గర ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(33) వికెట్ కోల్పోయింది.
126 పరుగుల దగ్గర ఓలీ స్టోన్ డకౌట్ అయ్యాడు.
చివరి వికెట్గా మొయిన్ అలీ అవుట్ అయ్యాడు.
కులదీప్ యాదవ్ బౌలింగ్లో 43 పరుగులు చేసిన మొయిన్ అలీని రిషబ్ పంత్ స్టంపింగ్ చేశాడు.
దీంతో భారత్ రెండో టెస్టులో ఇంకా ఒక రోజు ఆట మిగిలుండగానే ఇంగ్లండ్ మీద ఘన విజయం అందుకుంది.
నాలుగు టెస్టుల సిరీస్లో చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచిన రెండు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి.
భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 24-28 మధ్య అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరగనుంది.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









