''లాక్డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా''

ఫొటో సోర్స్, Getty Images
ఒక ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించిన వ్యక్తికి పట్టుకున్న పోలీసులు.. అతడి కుటుంబానికి సరుకులు ఇప్పించిన సంఘటన ఇది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విష్ణు విహార్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనంగా ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎందుకు దొంగతనానికి పాల్పడ్డావని పోలీసులు అడిగితే.. ''లాక్డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా'' అని చెప్పినట్లు ఇండోర్ ఏరోడ్రోమ్ సబ్ ఇన్స్పెక్టర్ కల్పనా చౌహాన్ తెలిపారు.
అతడు నిజమే చెప్తున్నాడని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించుకున్నట్లు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది.
దీంతో అతడి కుటుంబానికి అవసరమైన సరుకులను పోలీసులే అందించినట్లు కల్పనా చౌహాన్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కరోనావైరస్ను నియంత్రించటానికి రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల వలస కార్మికులు, కూలీలు తీవ్ర కష్టాలు పడుతున్న వార్తలు ప్రతి రోజూ వెలుగు చూస్తున్నాయి.
ప్రభుత్వం గత నెల రోజులుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా కూడా లక్షలాది మంది కార్మికులు వందలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తుండటం ఆగలేదు.
అనేక చోట్ల ఆకలితో, అలసటతతో కూలీలు చనిపోతున్న వార్తలూ కలచివేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా వలస కూలీల కష్టాలను తీర్చటానికి ఎటువంటి చర్యలు చేపట్టారని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.
అందరికీ వసతి, ఆహారం, కనీస సదుపాయాలు కల్పించి తీరాలని నిర్దేశించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుజరాత్, బిహార్, కేంద్ర ప్రభుత్వాలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు
ఇదిలావుంటే.. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులు తిండి, నీరు, కనీస సదుపాయాలు లేక అనారోగ్యం పాలవటం, చనిపోవటం జరుగుతోందన్న మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. గుజరాత్, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు చైర్మన్లకు నోటీసులు జారీచేసింది.
ఇవి కూడా చదవండి:
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- వలస కార్మికుల ఆకలి, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఏం చర్యలు చేపట్టారు?: సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
- ఇండియా లాక్డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- సోనూ సూద్: ఈ ‘విలన్’ వలస కార్మికులకు ‘దేవుడు’ ఎలా అయ్యారు?
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








