కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌ మసీదు వద్ద నిర్వహించిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన ఆరుగురు కరోనావైరస్ సోకి చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్లో తెలిపింది. మార్చి 13-15 మధ్య వీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆరుగురిలో ఇద్దరు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు.

అపోలో ఆస్పత్రిలో ఒకరు, గ్లోబల్ ఆస్పత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో ఒకరు చనిపోయారు.

దిల్లీలోని మార్కాజ్‌కు హాజరైన వారు ఎక్కడున్నారనే వివరాలను తెలియజేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తామని చెప్పింది.

పదిహేను రోజుల కిందట జరిగిన మర్కజ్ మత కార్యక్రమానికి దాదాపు 1700 మంది హాజరయ్యారు. వారిలో థాయ్‌లాండ్, ఇండొనేసియా, మలేసియా, కిర్గిజిస్తాన్ తదితర ఆసియా దేశాల నుంచి వచ్చిన వాళ్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

వీరు తిరిగిన ప్రాంతాలను ప్రక్షాళన చేయటానికి అధికారులు చర్యలు చేపట్టారు. వారు ఎవరెవరిని కలిశారనే వివరాల మీద దృష్టి పెట్టారు. అధికారులు ఇప్పటికే మర్కజ్‌ మసీదును మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై కేసు నమోదు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)