కరోనావైరస్: భారత్లో బయటపడిన తొలి కేసు.. చైనా నుంచి వచ్చిన విద్యార్థికి ఇన్ఫెక్షన్

ఫొటో సోర్స్, MOHFW_INDIA
ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ ప్రకంపనలు భారత్లోనూ మొదలయ్యాయి.
కేరళలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది.
చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు గుర్తించామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆసుపత్రిలో ఆ రోగిని విడిగా ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
రోగి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది.


కరోనావైరస్ బారిన పడి ఉండొచ్చన్న అనుమానంతో కేరళలో 400కుపైగా మందిని వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
దిల్లీ, ముంబయిలోనూ కొన్ని అనుమానిత కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 1 తర్వాత చైనా నుంచి వచ్చినవారు ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ సూచించింది.
దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 30 వేల మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు.
వుహాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చైనాతో భారత్ సంప్రదింపులు కూడా జరుపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి.
ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు చైనా అధికారులు కొన్ని నగరాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో వేరు చేశారు.
ఇది చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయం. కానీ మారిన పరిస్థితులతో ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు.
చైనాకు దాదాపు మధ్యలో ఉండే హుబే ప్రాంతంలో కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.
దీంతో, చైనా అధికారులు మిగతా నగరాల నుంచి హుబే ప్రాంతానికి రాకపోకలు నిషేధించారు.
ముందు ముందు కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ప్రస్తుతం చైనాలో ఆంక్షల జాబితా పెరుగుతూ పోతోంది. ఎక్కువ దేశాల్లో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ను ఇంకా 'అంతర్జాతీయ అత్యవసరస్థితి'గా ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- కరోనా వైరస్: వుహాన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









